పాల్గొన్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు
పలుచోట్ల సేవా కార్యక్రమాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు
విద్యానగర్, మార్చి 13 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్వీ, వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు సేవాకార్యక్రమాలను నిర్వహించారు. కేక్లు కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు, దవాఖానల్లో పండ్లపంపిణీ, రక్తదానాలు చేపట్టారు. ఎన్నికల ప్రచార బాధ్యతల్లో ఉన్న జిల్లా నేతలు ఆయా జిల్లాల్లో కవిత బర్త్డే వేడుకలను నిర్వహించారు.
ఎమ్మెల్సీ కవిత జన్మదినం సం దర్భంగా జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 15 మంది యువకులు రక్తదానం చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేట్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. టేక్రియాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి, బెలూన్లు ఎగురవేశారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు,కో -కన్వీనర్ వంశీ, సత్యనారాయణ, హరీశ్,స్వామిగౌడ్, పోశవ్వ, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దయానంద్, కార్యదర్శి వెంకట్రెడ్డి, కోశాధికారి సాయిలు, ఉపాధ్యక్షుడు సాయిలు, దేవరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ బాబా పాల్గొన్నారు.
మక్తల్లో..
బాన్సువాడ, మార్చి 13: మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బుడ్మి సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్, మహబూబ్నగర్ డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, శేఖర్, రామలింగం, శ్రీనివాస్ గుప్తా, ఈశ్వర్, నేతాజీరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.