సీసీసీ నస్పూర్, మార్చి 13 : టీబీజీకేఎస్ గౌర వ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను సీసీసీ నస్పూర్లో శనివారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీసీసీ ఆర్కే-5 కాలనీ సాయి ఆశ్రమం, విలేజ్శ్రీరాంపూర్లోని సాయి అం ధుల పాఠశాలలో టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ అనాథ వృద్ధాశ్రమం, అంధుల పాఠశాలలో కేక్ కట్ చేశారు. అనంతరం పండ్లు, బ్రెడ్లు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించామని వివరించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు బోయ మల్లయ్య, కుర్మిళ్ల అన్నపూర్ణ, చిడం మహేశ్, నాయకులు అన్నయ్య, ఏనుగు రవీందర్రెడ్డి, మంద మల్లారెడ్డి, వెంగళ కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, అశోక్, లెక్కల విజయ్, నీలం సదయ్య, అద్దు శ్రీను, దగ్గుల మధు, కాటం రాజు, నరేందర్రెడ్డి, చల్ల విక్రమ్, అన్ని గనుల పిట్ కార్యదర్శులు, టీబీజీకేఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.