తొర్రూరు, మే 1: కరోనా బాధితులకు ప్రతి ఒక్కరూ అం డగా నిలువాలని డీఎల్పీవో షర్ఫొద్దీన్, సర్పంచ్ గుం టు క యాదలక్ష్మి అన్నారు. మండలంలోని నాంచారిమడూర్ గ్రామంలో కరోనా బాధితులకు శనివారం వారు కలిసి నిత్యావసర సరుకులు పంపిణీతో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు వారీగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ను ని యంత్రించే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజూ శరీరానికి అవసరమైన మోతాదులో పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉషారాణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కొవిడ్ నియంత్రణలో భాగస్వాములవ్వాలి..
చిన్నగూడూరు: కొవిడ్ నియంత్రణలో ప్రతి ఒక్క రూ భాగస్వాములవ్వాలని మండల ప్రత్యేకాధికారి అప్జల్మోహినుద్దీన్ అన్నారు. మండల రెష్క్యూ టీం సభ్యులు శనివారం జయ్యారం, ఉగ్గంపల్లి గ్రామాల్లో కరోనా బాధితుల ఇండ్లలోకి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. తహసీల్దార్ కోమల, వైద్యాధికారి రవికుమార్, ఎంపీడీవో సరస్వతి, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి..
దంతాలపల్లి: కరోనా బాధితులు వైద్యుల సూచనలు పాటి స్తూ ధైర్యంగా ఉండాలని తహసీల్దార్ అబిద్ అలీ సూచిం చారు. మండలంలోని ఆగపేట, నిధానపురం, తూర్పుతండా, కుమ్మరికుంట్ల గ్రామాల్లో శనివారం కరో నా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇండ్లకు వెళ్లి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పెద్దవంగర: ఉపాధి హామీ పనుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఎంపీవో కిన్నెర యాకయ్య సూచించారు. శనివారం మండలంలోని బొమ్మకల్లు, రామచంద్రు తండా, పోచారం గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఏ యాకయ్యగౌడ్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.