పశువులకు గడ్డి విత్తనాలను సరఫరా చేయాలి
జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి
గొర్రెల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
1,43,042 జీవాలకు పీపీఆర్ టీకాలు
జిల్లా పశువైద్యాధికారి విజయశేఖర్రెడ్డి
మెదక్, మార్చి 16 : ఉపాధి హామీ పథకంలో బోర్లను రీచార్జ్ చేయాలని జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో (వ్యవసాయం) సమావేశం చైర్పర్సన్ లావణ్యరెడ్డి అధ్యక్షతన జరిగింది. మధ్యాహ్నం స్త్రీ, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు సంమృద్ధిగా కురవడంతో రైతులు గుంట వదలకుండా వరి నాట్లు వేశారని, తీరా ఎండలు అధికమవ్వడంతో పొలాలు ఎండిపోయే పరిస్థితులున్నాయన్నారు. మహారాష్ట్ర తరహాలో ఇక్కడి రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించాలని సూచించారు. విజయడెయిరీ ఆధ్వర్యంలో కేసీసీ ద్వారా రైతులకు రుణాలను అందజేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువులకు గడ్డి విత్తనాలను సరఫరా చేయాలని, అంతేకాకుండా గడ్డిని కటింగ్ చేసే యంత్రాన్ని రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారి పరుశురాంనాయక్ మాట్లాడుతూ ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం 1.97లక్షల ఎకరాలు సాగు అంచనా వేయగా 1.93 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారని తెలిపారు. 2020-21 సంవత్సరానికి యూరియా 29,808 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3288 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 3300 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్ ఎరువులు 16,490 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2375 మెట్రిక్ టన్నులు అంచనా వేయగా, ప్రస్తుతం 4525 మెట్రిక్ టన్నులు, డీఏపీ 250 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 525 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1150 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 260 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతు బంధు పథకం కింద 2020-21 సంవత్సరంలో 2,15,170 మంది రైతుల ఖాతాల్లో రూ.191. 46 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో రైతు బంధు పథకం కింద రైతులకు డబ్బు లు జమ చేస్తామని చెప్పారు. పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి విజయశేఖర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 33 శాతం గొర్రెలు, మేకలకు పీపీఆర్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15న ప్రారంభమైందని, ఇప్పటి వరకు జిల్లాలో 1,43,042 జీవాలకు పీపీఆర్ టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. మత్స్యశాఖ ఏడీ మల్లేశం మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 230 మత్స్య సహకార సంఘాలు ఉండగా 19 మహిళా మత్స్య సహకార సంఘాలు ఉన్నాయని, 15,700 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. 2020-21 సంవత్సరంలో 1211 చెరువులు, కుంటలలో 414.60 లక్షల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. పోచారం, ఘణపూర్ ఆనకట్ట, హల్ధీ వాగుల్లో మత్స్యకారులకు లైసెన్స్లు ఇ చ్చి, వారికి జీవనోపాధి కల్పించామన్నారు. సమావేశం లో జడ్పీ సీఈవో శైలేశ్, జడ్పీటీసీలు సంధ్య, కవిత, సరోజన, మేఘమాల, షర్మిల, యాదగిరి, కో ఆప్షన్ సభ్యులు మన్సూర్అహ్మద్, యూసుఫ్, విజయ డెయి రీ డీడీ నాగేశ్వర్రావు, శాఖల అధికారులు పాల్గొన్నారు.