రామచంద్రాపురం, డిసెంబర్ 1 : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం డివిజన్లోని వార్డు కార్యాలయంలో ఇంజినీరింగ్, శానిటరీ, బయోడైవర్సిటీ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎంఐజీలో పెండింగ్లో ఉన్న మహిళా భవనం, బొంబాయి కాలనీ, ఎల్ఐజీలో సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్, పార్కుల మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. డైబాక్ వ్యాధితో చనిపోతున్న వేప చెట్లకు శిలీంద్ర సంహారిణి మందును పిచికారీ చేయాలని సూచించారు. బీడీఎల్ కాలనీలో పెండింగ్లో ఉన్న పార్కు పనులు, విద్యుత్నగర్లో కొత్తగా పార్కు ఏర్పాటు ప్రతిపాదనను పూర్తి చేయాలన్నారు. డివిజన్లో పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని, ఆయా కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి రీ-టెండర్ వేయాలని చెప్పారు. ఎల్ఐజీ బస్టాప్లో సెంట్రల్ లైటింగ్, కాలనీల్లో అవసరం ఉన్న చోట కొత్త లైన్లు, కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని విద్యుత్శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో ఈఈ శంకర్, ఏఈ ప్రభు, విద్యుత్శాఖ ఏఈ రామ్మోహన్, వర్క్ ఇన్స్పెక్టర్ అక్రమ్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్, ఎల్ఐజీ కాలనీ అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, మ్యాక్ సొసైటీ అధ్యక్షుడు పాపయ్య తదితరులు పాల్గొన్నారు.