ఎల్బీనగర్ : చదవుతో పాటు క్రీడారంగంలోనూ విద్యార్థులు ఉత్తమంగా రాణించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. అండర్ 18 పరుగుపందెంలో జాతీయ స్థాయిలో హర్యాన, గోవాల్లో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించిన దిల్సుఖ్నగర్కు చెందిన క్రీడాకారుడు రాకేష్ కుమార్ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో తమ సత్తాను చాటాలన్నారు. క్రీడల్లో రాణించే వారికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. పరుగు పందెంలో బంగారు పతకం సాధించిన రాకేష్ కుమార్ ప్రస్తుతం దిల్సుఖ్నగర్లోని శ్రీ చైతన్య నీట్, ఐఐటీ అకాడమీలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు.
సత్కరించిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా
జాతీయ స్థాయిలో పరుగుపందెంలో బంగారు పతకాన్ని సాధించిన క్రీడాకారుడు రాకేష్కుమార్ను ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ఉత్తమంగా రాణించాలని కోరారు.