బీబీనగర్, మే 2 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్నిరంగాలు అభివృద్ధి చెందాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జైనపల్లి, పడమటి సోమారం, వెంకిర్యాల, పల్లెగూడెం, చిన్నరావులపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జైనపల్లి నుంచి కొండమడుగు వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పడమటిసోమారంలో హెచ్ఎండీఏ నిధులు రూ.57 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రైతు వేదికను ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ. 25 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెంకిర్యాలలో హెచ్ఎండీఏ నిధులు రూ.32 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.25 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
పల్లెగూడెంలో హెచ్ఎండీఏ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ. 25 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. చిన్నరావులపల్లిలో హెచ్ఎండీఏ నిధులు రూ. 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.25 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణపల్లిలో హెచ్ఎండీఏ నిధులు రూ. 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.25 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం రైతువేదికను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సుధాకర్గౌడ్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయీ సంఘం చైర్మన్ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచాల రవికుమార్, సర్పంచులు భాగ్యలక్ష్మి, బాల్రెడ్డి, బాలమల్లేశ్, గణేశ్యాదవ్, సుదర్శన్, భారతమ్మ, బాలమణి, సత్తిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బాలచందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.