ఆలేరు, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గ్రామగ్రామాన పండుగలా జరిగాయి. ఆలేరు పట్టణంలో పార్టీ నాయకులు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఆలేరు రూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ శాఖల ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాజాపేట : మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రఘునాథపురం గ్రామశాఖ అధ్యక్షుడు కొండం రాజు, నాయకులు సందిల ఉదయ్భాస్కర్గౌడ్, రామిండ్ల నరేందర్, డొంకెన మహేందర్గౌడ్, రాసూరి నర్సయ్య, బోగ రాజు, బత్తెం కనకరాజు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి తదితరులు తరలివెళ్లారు.
ఆత్మకూరు(ఎం) : మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలను పార్టీ గ్రామశాఖల అధ్యక్షులు ఎగురవేసి సంబురాలు జరుపుకొన్నారు. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామశాఖల అధ్యక్షులు పార్టీ జెండాలను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, సర్పంచులు పడాల వనిత, పోగుల ఆంజనేయులు, నామసాని సత్యనారాయణ, మహేందర్, కల్లూరి ప్రభాకర్రెడ్డి, రామోహన్శర్మ, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, టీఆర్ఎస్వీ, యువజన విభాగం మండలాధ్యక్షులు భరత్, కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దూనాయక్, మండల కో ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, యాకూబ్, గురువయ్య పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత తెలంగాణలోని ప్రజలకు అన్నిరకాలుగా న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్లో జరిగిన ప్లీనరీలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, నియోజకవర్గ, మండల నాయకులు పాల్గొన్నారు.
గుండాల : మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. పార్టీ ఆవిర్భావం, ఉద్యమ తీరుతెన్నులను గుర్తుచేసుకున్నారు. వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పాండరి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సైదయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు ప్రకాశ్, బాల్రెడ్డి, రంజిత్రెడ్డి, దయాకర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ లక్ష్మీరాములు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖలీల్ తరలివెళ్లారు.
మోటకొండూర్ : మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరెగూడెంలో జరిగిన వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో గ్రామశాఖల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్లీనరీలో జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి పాల్గొన్నారు.