భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 25 : ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమల వ్యాప్తిని నియంత్రించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కావూరి మల్లికార్జున్రావు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రభుత్వ ఏరియా దవాఖాన వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. డీఐఓ పరిపూర్ణాచారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని, వైద్య సిబ్బంది ప్రశాంత్, సుమన్కళ్యాణ్, వివేక్, అంజయ్య, మధుమోహన్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి : డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోదచౌటుప్పల్ మలేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద అన్నారు. పట్టణంలో వైద్యసిబ్బంది నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండల వైద్యాధికారి శివప్రసాద్రెడ్డి, హర్షరెడ్డి, కాటం రాజు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
బీబీనగర్ : మలేరియా నిర్మూలనకు ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని పీహెచ్సీ వైద్యాధికారి సత్యప్రకాష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మలేరియా నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని శారాజీపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి శివవర్మ, నోడల్ అధికారి బెజవాడ పెద్దలక్ష్మి పాల్గొన్నారు.
రాజాపేట : మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో వైద్యాధికారి రాజేందర్, వైద్య సిబ్బంది ఉపేందర్, రజిత, ఆశ, కృష్ణనీల, మహేశ్వరి, రేణుక, కవిత, భాగ్య పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీల్లో పీహెచ్సీ వైద్యాధికారి రవీంద్రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, హెచ్ఈఓ ప్రవీణ్కుమార్, పీహెచ్ఎన్ దేవావర, సిబ్బంది పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండలకేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో మండల వైద్యాధికారి నరేశ్, వైద్యసిబ్బంది నర్సయ్య, శివాజి పాల్గొన్నారు.