యాదాద్రి, నవంబర్18 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి, అమ్మవార్లకు వైభవంగా నిత్యారాధనలు నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును జరిపించారు. ఉదయం తెల్లవారుజామూనే స్వామివారి నిత్యకైంకర్యాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. కార్తీకమాసం సందర్భంగా యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. తెల్లవారుజామూనే మహిళలు స్వామి, అమ్మవార్లకు దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న జడ్జీలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నారాయణ సింగ్ ధనిక్, నల్లగొండ జిల్లా సెషన్ జడ్జి జగ్జీవన్కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,34,998
రూ.100 దర్శనం టిక్కెట్ 47,000
వేద ఆశీర్వచనం 2,580
క్యారీబ్యాగుల విక్రయం 6,600
టెంకాయల విక్రయం 21,000
వ్రత పూజలు 1,97,000
కల్యాణకట్ట టిక్కెట్లు 15,200
ప్రసాద విక్రయం 3,38,490
వాహన పూజలు 11,700
టోల్గేట్ 850
అన్నదాన విరాళం 17,665
సువర్ణ పుష్పార్చన 97,380
యాదరుషి నిలయం 71,100
పాతగుట్ట నుంచి 73,355
గోపూజ 1,600