వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్కు సూచించిన సీఎస్ సోమేశ్కుమార్
భువనగిరి అర్బన్, ఏప్రిల్6: సెకండ్ వేవ్ ఉధృతిని నియంత్రించేందుకు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. మం గళవారం ఆయన కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు చేశారు. కరోనా కేసు లు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ, మండల స్థాయి యంత్రాంగం, రెవెన్యూ అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలన్నారు. రోజువారీగా కొవిడ్ పరీక్షలను పెంచాలని పాజిటివ్, కాంటా క్టు కేసులను గుర్తించి బాధితులను హోంక్వారంటైన్ చేసి వైద్యం అందేలా చూడాలన్నారు. దవాఖానలను సిద్ధం చేసుకుని ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. 45 ఏండ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ను రోజువారీగా పెంచాలన్నారు. భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనితారామచంద్రన్ కొవిడ్ కట్టడికి పోలీసులు, రెవెన్యూ, మండల, గ్రామ స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, కీమ్యానాయక్, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు పాల్గొన్నారు.