నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజీవ్రాజ్
ఆలేరు టౌన్, ఏప్రిల్ 6 : కొవిడ్ టీకాపై అపోహ లు వద్దని నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజీవ్రాజ్ అన్నారు. ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని కోరారు. కొవిడ్ రోజురోజుకూ ఉధృతం అవుతున్నందున తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గణేశ్నాయక్, ఎస్ఐ రమేశ్, శారాజీపేట వైద్యాధికారి రాజేందర్, ఎంపీవో సలీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించాలి
మోటకొండూర్, ఏప్రిల్ 6: కొవిడ్ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని స్టేట్ కొవిడ్ నోడల్ అధికారి రాజీవ్ మండల వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం మండలంలోని పీహెచ్సీ లో ఆశ వర్కర్లు, ఎంపీడీవో కార్యాలయంలో పం చాయతీ కార్యదర్శులకు మండల వైద్యాధికారి రాజేందర్నాయక్, ఎంపీడీవో వీరస్వామితో కలి సి కొవిడ్ వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 45 ఏండ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్య సిబ్బంది ప్రవీణ్కుమార్, ఏఎన్ఎం ధనమ్మ, ఏపీ వో కిషన్, పంచాయతీ కార్యదర్శులు శ్రవణ్కుమార్, సాయికుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
భౌతిక దూరం పాటించాలి
రాజాపేట, ఏప్రిల్ 6 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో ప్రజాప్రతినిధులకు మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్పై రాష్ట్ర వైద్యశాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 45 ఏండ్ల పైబడిన వారు తప్పక కొవిడ్ టీకా తీసుకోవాలని, మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు వెంకటేశ్, శ్రీదేవి, ఎంపీపీ బాలమణి, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
కొవిడ్ టీకా తీసుకోవాలి
బీబీనగర్, ఏప్రిల్6 : ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని ఎంపీపీ సుధాకర్గౌడ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవార ం రెండో విడుతగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేలా ప్రజలకు అవగాహన కల్పించి, ప్రోత్సహించేలా ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య, ఎంపీడీవో శ్రీవాణి, పీహెచ్సీ వైద్యాధికారులు ప్రవీణ్కుమార్, దాక్షాయణి పాల్గొన్నారు.
45 ఏండ్లు పైబడిన వారందరూ..
రామన్నపేట,ఏప్రిల్6: కొవిడ్ కట్టడికి ప్రజలం దరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా నోడల్ అధికారి ఉమా అన్నారు. మంగళవారం మండలపరిషత్ సమావేశమందిరంలో కొవిడ్ నియంత్రణకు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ 45 ఏండ్లు పైబడిన వా రందరూ కొవిడ్ టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో జలేంధర్రెడ్డి, మండలవైద్యాధికారి రవికుమార్, సత్యనారాయణ, వివిధగ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మాస్కులు ధరించాలి
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్6: కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ట్రాఫిక్ సీఐ ముని అన్నారు. మంగళవారం ఆయన దివీ స్ పరిశ్రమ వద్ద ఆటోడ్రైవర్లకు కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
వదంతులను నమ్మొద్దు
వలిగొండ, ఏప్రిల్6: కరోనా టీకాపై అపోహలు, వదంతులను నమ్మవద్దని ఎంపీపీ రమేశ్రాజ్ అన్నారు. మంగళవారం మం డల కేంద్రంలోని పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మాఅనంతరెడ్డి, సర్పంచ్ లలితాశ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఉమా, వైద్యాధికారులు సుమన్కల్యాణ్, కిరణ్కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ కట్టడికి సహకరించాలి
భూదాన్పోచంపల్లి, ఏప్రిల్6 : కొవిడ్ కట్టడికి ప్ర జలతోపాటు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని ఎంపీపీ ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొవిడ్ రెండో దశను అడ్డుకోవడానికి కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. బుధవారం ప్రజాప్రతినిధులకు కొవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర కమిషనర్ ఫ్యా మిలీ వెల్ఫేర్ నోడల్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో 45 ఏండ్లు దాటిన వారికి టీకాలు వేయడానికి ప్రణాళిక వేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్ లింగస్వామి, ఎంపీడీవో బాలశంకర్, సత్యప్రకా శ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.