యాదాద్రి, జనవరి 27 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణం జరిపించారు. కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిణి రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ పుష్కరిణి చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. యాదాద్రి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సత్యనారాయణ స్వామి పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ.12,83,648 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
31న హుండీ లెక్కింపు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి హుండీ లెక్కింపును ఈ నెల 31వ తేదీన కొండపైన గల హరితభవన్లో చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కిం పు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,22,650
రూ.100 దర్శనం టిక్కెట్ 5,000
వీఐపీ దర్శనాలు 1,12,050
వేద ఆశీర్వచనం 2,400
సుప్రభాతం 1,200
ప్రచారశాఖ 2,500
క్యారీబ్యాగుల విక్రయం 8,250
వ్రత పూజలు 26,400
కల్యాణకట్ట టిక్కెట్లు 17,200
ప్రసాద విక్రయం 4,30,300
శాశ్వత పూజలు 55,000
వాహన పూజలు 9,600
టోల్గేట్ 820
అన్నదాన విరాళం 7,938
సువర్ణ పుష్పార్చన 67,600
యాదరుషి నిలయం 32,250
పాతగుట్ట నుంచి 20,620
ఇతర విభాగాలు 3,61,870