బంజారాహిల్స్ : కాలనీలు, బస్తీల సమగ్రమైన అభివృద్దే లక్ష్యంగా అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శ్రీనగర్ కాలనీలో రూ.11లక్షలతో చేపట్టిన మంచినీటి పైప్లైన్ పనులను వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి గురువారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ..ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వాటర్వర్క్స్ మేనేజర్ మమత, వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్కుమార్, శ్రీనగర్కాలనీ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అప్పుఖాన్, ప్రధాన కార్యదర్శి మధుకర్ యాదవ్, తన్నుఖాన్, కవిత, భార్గవి, శరత్గౌడ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.