ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. మహిళలకు సరైన ప్రాముఖ్యత కల్పిస్తూ పాత కొత్తల కలయికతో, చురుకుగా పని చేసే వారికి కమిటీలలో ప్రాధాన్యత కల్పించనున్నట్లు చెప్పారు. శుక్రవారం టీఆర్ఎస్ మహిళా నేత ఎస్.శ్రవంతి ఆధ్వర్యంలో రాంనగర్ డివిజన్కు చెందిన వివిధ పార్టీల మహిళా నేతలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ముషీరాబాద్ అయేషా ఫంక్షన్హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ప్రాధాన్యత కలిపస్తుందన్నారు. స్థానిక సంస్థలతో పాటు, నామినేటెడ్ పదవులు, ఉద్యోగ రంగాలలో మహిళలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
స్థానిక సంస్థల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా నాయకత్వాన్ని ప్రొత్సహించడం జరుగుతుందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం రాయితీ రుణాలు, వీధివ్యాపారులకు వడ్డిలేని రుణాలు ఇచ్చి ఆదుకుంటుందన్నారు. పార్టీలో చేరిన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేయాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇరత పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ముఠా జయసింహా అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జయసింహ, ఆర్.మోజస్, ముక్తార్ స్సేన్, ముదిగొండ మురళీ, ఎరం శేఖర్, ఇంద్రసేనారెడ్డి, రజినీకాంత్, పాశం అరవింద్రాజ్ యాదవ్, కల్పన, ఉమామహేశ్వరీ, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.