Cemetery
అత్తాపూర్ : హైదర్గూడ మూసీ వద్ద ఉన్న స్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు అని విధాలుగా కృషిచేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. స్మశానవాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ హైదర్గూడ గ్రామస్తులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.
రాజేంద్రనగర్, గోల్కొండ రెవెన్యుల పరిధిలో ఉండడంతో స్మశానవాటిక అభివృద్దికి ఆటంకం కలుగుతుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మూసీ నది పక్క నుంచి నూతనంగా రోడ్డును నిర్మించారని అప్పటి నుంచి స్మశానవాటిక శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్తులు తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మశానవాటిక అభివృద్ది కోసం వారం రోజుల్లో సంబంధిత అధికారులతో కలిసి పర్యటిస్తానని తెలిపారు. అత్తాపూర్, పురానపూల్, అంబర్పేటలకు చెందిన స్మశానవాటికలన్నీ మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయని హైదర్గూడ స్మశానవాటికను కూడ అదే రీతిలో అభివృద్ది చేస్తామని అన్నారు.
అంత్యక్రియలకోసం వచ్చె వారి కోసం ప్రత్యేకంగా షెడ్లు, అస్తికలు భద్రపరిచేందుకు, స్నానాలు చేసేందుకు గదులను కూడా నిర్మిస్తామని అన్నారు. మూసీ డెవలప్మెంట్ సభ్యులతో మాట్లాడి స్మవానవాటిక కోసం స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. స్మశానవాటిక అభివృద్ది కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
.రాష్ట ప్రభుత్వం కూడా వైకుంఠదామాల అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్ కార్పోరేటర్ సంగీతతో పాటు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రణవభక్త సమాజం సభ్యులు, యువజనసంఘాల సభ్యులు పాల్గొన్నారు.