కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. కాచిగూడ డివిజన్లోని జమాల్బస్తీకి చెందిన వందన (40) గత కొన్ని నెలలుగా
ఆరోగ్యం బాగలేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా ఇటీవల ఆమె ఆరోగ్యం కుదుటపడింది.
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీమాగౌని కృష్ణాగౌడ్ చొరవతో మంగళవారం వందనకు రూ.32 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద చెక్కును ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా తెలంగాణను ఏడేండ్లలోనే అభివృద్ధి చేయడంతో సీఎం కేసీఆర్ పాలనపై యావత్ ప్రజానీకం నీరాజనం పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బి.కృష్ణాగౌడ్, వందన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.