రానున్న హరితహారంలో పట్టణంలో 1.32లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
నర్సరీల్లో అధిక సంఖ్యలో నీడనిచ్చే, పండ్లు, పూల మొక్కల పెంపకం
సంరక్షణకు ప్రత్యేక చర్యలు..
హరితవనంగా మారనున్న మున్సిపాలిటీ
వర్ధన్నపేట, ఏప్రిల్ 2: మున్సిపాలిటీని హరితవనంగా మార్చేందుకు పాలకమండలి సిద్ధమవుతున్నది. వర్షాకాలంలో పట్టణాల్లో ఎ క్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా పరిధిలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో రాబోయే వర్షాకాలంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటించి సంరక్షించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, పాలక మండలి ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి నర్సరీల్లో పెంచాల్సిన మొక్కలు, వాటి లక్ష్యాన్ని నిర్దేశించారు.
వర్ధన్నపేటలో 1.32లక్షల మొక్కలు..
వచ్చే హరితహారంలో వర్ధన్నపేట పట్టణ పరిధిలో 1.32 లక్షల మొక్కలు నాటాలని పాలకమండలి నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ హరిత హాజరై హరితహారానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అన్ని రకాల మొక్కలను నర్సరీల్లో పెంచడంతోపాటు అవసరమైన మొక్కలను బయటినుంచి తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం పట్టణ పరిధిలో రెండు నర్సరీలను ఏర్పాటు చేశా రు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న డీసీతండా సమీపంలోని నర్సరీలో 80వేలు, పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని నర్సరీలో 52వేల మొక్కలను పెంచుతున్నారు. నీడనిచ్చే, పండ్లు, పూల మొక్కలు ఎక్కువ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సంరక్షణపై ప్రత్యేక దృష్టి
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు చనిపోతే సంబంధిత పాలకమండలి, అధికారులపై చర్య లు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు ముందస్తుగానే మొక్కలు నాటే ప్రదేశాలు, సంరక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇవి కూడా చూడండి..
ఆడపిల్ల పుట్టిందని సంకేతమిస్తూ.. నీటిలో కూలిన విమానం
రైలు ప్రమాదం.. 48కి చేరిన మృతుల సంఖ్య