పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ, ఏప్రిల్ 10 : విలీన గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులను కేటాయిస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధిలోని 16వ డివిజన్ కీర్తినగర్ కాలనీ, జాన్పాకలో రూ 9.38 కోట్లతో నిర్మించే రోడ్లు, డ్రైనేజీ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజుల్లో రోడ్లు, డ్రైనేజీల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విలీన గ్రామాలను అభివృద్ధి చేసి, పట్టణ వైభవం తీసుకురావాలని సూచించారు. గొర్రెకుంట ఇండస్ట్రియల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్పై గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సంపత్రావు, గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మొగిలిచర్ల సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కుడా డైరెక్టర్ వీరగోని రాజ్కుమార్, పార్టీ గీసుగొండ మండల కార్యదర్శి పూండ్రు జైపాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సుంకరి శివ, గోపాల నవీన్రాజు, ప్రభాకర్రెడ్డి, నాగరాజు, లవ్రాజు, రవితేజ, లక్ష్మణ్రావు, ఉపేందర్, రాజు, ఆరీఫ్, కొండా రాధ, చెక్క రమేశ్, సంజీవ పాల్గొన్నారు.
పార్టీ కోసం పని చేయాలి
పరకాల : టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పార్టీ కోసం పని చేయాలని, అధిష్టానం సూచించిన అభ్యర్థులు ఎవరైనా వారి గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం పరకాలలోని క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. పట్టణంలో 9వ వార్డు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు. పార్టీ ఆదేశాల మేరకు పని చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ విజయపాల్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి, ప్రధాన కార్యదర్శి మడికొండ శ్రీను, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కాగా, సెలూన్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ పలువురు నాయీ బ్రాహ్మణులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో పరకాల డివిజన్ సెలూన్ల కమిటీ అధ్యక్షుడు కురిమిండ్ల రవీందర్, ప్రధాన కార్యదర్శి చెన్న మహేందర్, కోశాధికారి ముల్కనూరి రఘు, గౌరవ సలహాదారు చెన్న సదానందం, ఉపాధ్యక్షుడు చెన్న సాంబయ్య, నాయకులు మాచర్ల రాజు, నాగవెళ్లి ఎల్లయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సీఎం పేషీ అంటూ మోసాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు
రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే