కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
మెప్మా ద్వారా రుణమిప్పిస్తానని మహిళకు భరోసా
సుబేదారి, ఏప్రిల్ 8 : ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ గురువారం హైదరాబాద్కు వెళ్తుండగా నక్కలగుట్ట రోడ్డులో తోపుడు బండిపై బోళ్ల వ్యాపారం చేస్తున్న చిరు మహిళా వ్యాపారిని చూసి తన కారు ఆపారు. ఆమె వద్దకు వెళ్లి మాట్లాడారు. వ్యాపారం ఎలా ఉంది.. రోజుకు ఎన్ని బోళ్లు అమ్ముడు పోతున్నాయి.. కు టుంబ ఆర్థిక పరిస్థితి గురించి వాకబు చేశారు. ‘కరోనా వచ్చి మాలాంటి పేదల బతుకులను ఆగం చేసింది.. అప్పుల వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం’ అని సద రు మహిళ గోడు వెళ్లబోసుకున్నది. మీ లాంటి పేద చిరువ్యాపారులకు తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వారికి మెప్మా నుంచి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, సదరు మహిళ వివరాలను తన పీఏను నమోదు చేసుకోమని చెప్పి వినయ్భాస్కర్ హైదరాబాద్కు వెళ్లారు.
ఇవి కూడా చదవండి..