వాజేడు/గోవిందరావుపేట, ఏప్రిల్ 5 : వాజేడు మండలకేంద్రంతోపాటు మండలంలోని ప్రగళ్లపల్లి, జగన్నాథపురం, కొప్పుసూరు, చెరుకూరు, పేరూరు తదితర గ్రామాల్లో సోమవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో పలుచోట్ల మామిడి తోటల్లో మామిడి కాయలు, చింతకాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. మిర్చి కల్లాల్లో ఆరబోసిన పంటను కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్ కవర్లు కప్పారు. గాలిదుమారానికి 3 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, గోవిందరావుపేట గ్రామాల్లో సోమవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. లక్నవరంలో వర్షం లేనప్పటికీ బలమైన ఈదుగాలులకు రెస్టారెంట్ అద్దాలు పగిలిపోయి స్వల్పనష్టం వాటిల్లింది.
ఇవి కూడా చదవండి..
షిరిడీ సాయి బాబా ఆలయం నేటి రాత్రి నుంచి మూసివేత
అనిల్ దేశ్ముఖ్ రాజీనామా : ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ ఫైర్