ముంబై: మహారాష్ట్ర షిరిడీలోని ప్రసిద్ధ సాయి బాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల నుంచి తదుపరి ఆదేశాల వరకు మూసివేయనున్నారు. సాయి బాబా ఆలయంతోపాటు అక్కడి ప్రసాదాలయం, భక్త నివాస్ను కూడా మూసివేయనున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతరాల్లో పూర్తిగా లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం పేర్కొంది. ఈ నేపథ్యంలో షిరిడీ సాయి బాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల తర్వాత నుంచి మూసివేయాలని ఆలయ సంస్థాన్ నిర్ణయించింది. ఆలయాన్ని తిరిగి ఎప్పటి నుంచి తెరుస్తారు అన్నది భక్తులకు తెలియజేయనున్నది.