ధర్మసాగర్, ఆగస్టు 19 : విద్యార్థుల్లో జాతీయభావాన్ని పెంపొందించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజ య్య అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని కరుణాపురం కరుణాలయంలో అనాథలు, ఎయిడ్స్ బాధితులు, వృద్ధులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మా ట్లాడుతూ దేశ ఐక్యతను చాటేందుకు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో కరుణాలయం డైరెక్టర్ ఫాదర్ అలే, ఫాదర్ రమేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఐసీపీఎస్ సోషల్ వర్కర్ ఎం శ్రీనివాస్, సీఐ రమే శ్, మాజీ ఎంపీటీసీ సిక వసంత, రవి, బాలస్వామి, ప్రవీణ్, సుమన్, వంశీ, రమణ, అరుణ్ పాల్గొన్నారు.
హనుమకొండ : బాలసదనంలో పిల్ల లు తల్లిదండ్రులు లేరని బాధ పడవద్దని జడ్పీ చైర్మన్ డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్ అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ బాలికా సదనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభు త్వం చూసుకుంటుందన్నారు. లక్ష్య సాధ న దిశగా చదువుతో పాటు క్రీడలు, సాం స్కృతిక రంగాల్లో రాణించాలని సూచించారు.
అనంతరం పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. డైనింగ్ హాల్లో ఫ్యాన్ కోసం నగదును అందించారు. కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ పిట్టల శ్రీలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అన్నమనేని అనిల్చందర్రావు, జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత, సీడీపీవోలు కే మధురిమ, కే శిరీష, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కే అనితారెడ్డి, బాలసదనం పర్యవేక్షణ అధికారి ఎం కల్యాణి, ప్రొటెక్షన్ అధికారి ఎస్ ప్రవీణ్కుమార్, రంజిత్, న్యాయవాది వినోద్ పాల్గొన్నారు.
పరకాల : పట్టణంలోని సివిల్ దవాఖానలో రోగులకు, సబ్ జైలులో ఖైదీలకు మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీ జూపల్లి శివరామయ్య, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, సీఐ పుల్యాల కిషన్, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, కౌన్సిలర్లు మడికొండ సంపత్కుమార్, ఒంటేరు సారయ్య, దామెర మొగిలి, నల్లెల్ల జ్యోతి, అడప రాము, పసుల లావణ్య, శనిగరపు రజిని, మార్క ఉమాదేవి, పీ గోపి, కోఆప్షన్ సభ్యుడు షబ్బీర్ అలీ, టీఆర్ఎస్ నాయకులు మునిగంటి విష్ణువర్ధన్, బండి వెంకటేశ్ పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : మానసిక దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ భరోసా కల్పించాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బన్నా అయిలయ్య కోరారు. కేయూ రోడ్డులోని అతిథి మానసిక దివ్యాంగుల కేంద్రంలో నిర్వహించిన వజ్రోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆశ్రమం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రోహిత్ బండిరెడ్డి ఆధ్వర్యంలో ఆశ్రమానికి 20 బ్లాకెట్లు, 230 కిలోల బియ్యం అందజేసినట్లు నిర్వాహకురాలు ఎస్ సుజాత తెలిపారు. కార్యక్రమంలో పీ విజయ్కుమార్, సిబ్బంది ఎస్ స్నేహలత, జీ రజిత, ఆసియా, కే రత్నం పాల్గొన్నారు.
ఆత్మకూరు : మండల కేంద్రంలోని పీహెచ్సీలో దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ఎంపీపీ మార్క సుమలత రజినీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, సర్పంచ్ వంగాల స్వాతీ భగవాన్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, ఏపీవో రాజిరెడ్డి, వైద్యాధికారి పద్మశ్రీ, ఎంపీటీసీ బయ్య రమారాజు, టీఆర్ఎస్ నాయకుడు వేల్పుల గణేశ్, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.