ఓరుగల్లులో సినీ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలో‘వర్ణం ఆలయం ఆఫ్ సిల్క్స్’ను అభిమానుల కోలాహలం నడుమ బుధవారం ప్రారంభించారు.
గిర్మాజీపేట, మే 11 : వరంగల్ చౌరస్తాలో కాసం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘వర్ణం ఆలయం ఆఫ్ సిల్క్స్’ షాపింగ్ మాల్ను సినీ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ బుధవారం ప్రారంభించారు. అన్ని రకాల వస్ర్తాలు ముఖ్యంగా వెడ్డింగ్ షాపింగ్ అంతా ఇక్కడే చేసుకునేలా దీనిని తీర్చిదిద్దారు. పట్టుచీరలు, గాగ్రాస్, బొటిక్స్, కస్టమైజ్డ్ వస్ర్తాలకు ఈ షాపింగ్మాల్ ప్రత్యేకంగా నిలువనుంది. హైదరాబాద్ నగరంలో లభించే అన్ని రకాల వస్ర్తాలు వరంగల్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
వస్త్ర వ్యాపార రంగంలో 75 సంవత్సరాల అనుభవంతో నగరవాసులకు కొత్తదనాన్ని అందించాలనే లక్ష్యంతో వర్ణం షాపింగ్మాల్ను కాసం గ్రూప్ చైర్మన్ కాసం నమఃశివాయ ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు ధాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు గందె కల్పనానవీన్, ఆకుతోట శిరీశ్, సిద్దం రాజు, కవితాయాదవ్, మరుపల్ల రవి, ముష్కమల్ల అరుణాసుధాకర్, బాలిన సురేశ్, టీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, హరిరమాదేవి, చార్టర్డ్ అకౌంటెంట్ గోపిచంద్, ప్రముఖ వస్త్ర వ్యాపారి పీఎన్ మూర్తి, వర్ణం షాపింగ్మాల్ డైరెక్టర్లు కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్, విశాల్, వరుణ్, తొనుపునూరి కార్తీక్, అరుణ్, రాహుల్ పాల్గొన్నారు.