హనుమకొండ, సెప్టెంబర్ 25 : హైటెక్ హంగులతో పెట్ పార్కును తీర్చిదిద్దినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ 30వ డివిజన్ బాలసముద్రంలో రూ.78 లక్షలతో నిర్మించిన పెట్ పారును శనివారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ మనుషులకు అత్యంత ఇష్టమైన పెంపుడు జంతువులను కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటారని అన్నారు. అందుకే శునకాలను ఇష్టపడే వారి కోసం హైదరాబాద్ తర్వాత వరంగల్లో పెట్ పార్కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పచ్చని మొకలు, ఆహ్లాదం పంచేలా పరిసరాలు, ఆటవస్తువులు ఉన్నాయని వివరించారు. నగర వాసుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ మహానగరంలో ఎన్నో పారులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వామం కావాలని, పారు నిర్వహణ సమర్థంగా చేపట్టాలని కోరారు. త్వరలో పారులో డాగ్షో ఏర్పాటు చేయాలన్నారు. శునకాల ఆరోగ్యం కోసం పారులో ఒక వెటర్నరీ క్లినిక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చీఫ్ విప్ సూచించారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ జీడబ్ల్యూఎంసీ పరిధిలో పారులు, జంక్షన్లను ఏర్పాటు చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఖాళీ స్థలాలను గుర్తించి, పారులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొకలు నాటి, పరిరక్షిస్తున్నామని తెలిపారు. శునకాల కోసం బాలసముద్రంలో వినూత్నంగా పెట్ పారు నిర్మించామని వెల్లడించారు. పెంపుడు కుకల ఆట విడుపు కోసం జంపింగ్ జోన్, పరుగోళా, వాకింగ్ బార్, జూలా లాంటి ఆటవస్తువులు ఇందు లో అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే, ప్రత్యేకంగా నీటి కొలను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. పిల్లల కోసం వాకింగ్ ట్రా క్, షటిల్ కోర్టు, ఓపెన్ జిమ్, మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. ప్రత్యేకంగా ప్లాస్టిక్ గడ్డి(టర్చ్) పచ్చదనంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు మేయర్ పేర్కొన్నారు. పారు ప్రవేశ ముఖద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. నగర ప్రజలు పెట్ పార్కును సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల కోమల, సీహెచ్వో సునీత, ఈఈలు లక్ష్మారెడ్డి, డీఈ సంతోష్బాబు, వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్, ఏఈలు పాల్గొన్నారు.