పర్యావరణ స్ఫూర్తికి వనపర్తి జిల్లా ప్రతీకగా నిలుస్తున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పచ్చని వనాలుగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా అభివర్ణించే హరితహారం కార్యక్రమానికి సబ్బండ వర్గాల సహకారం లభిస్తున్నది. వనపర్తి జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు కోటీ50లక్షలకు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. నాటి మొక్కలు నేడు వృక్షాలుగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
వనపర్తి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా పర్యావరణ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ మానస పుత్రికగా అభివర్ణించే హరితహారం కార్యక్రమానికి సబ్బండ వర్గాల సహకారం లభిస్తున్నది. మా నవజాతి మనుగడకు మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తుండడంతో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థిలోకం, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మహోద్యమంగా హరితహారంలో భాగస్వాములయ్యారు. రహదారులకు ఇరువైపులా, నగరం, పట్టణం తేడా లేకుండా ప్రతి వీధిలో మొక్కలు నాటారు. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చదనం పరిఢవిల్లుతున్నది. పల్లె ప్రకృతి వ నాలు, ఎకో పార్కులు నూతన శోభను తీసుకొచ్చాయి. ప్రతి ఏటా మొక్కల సంఖ్యను పెంచుకుంటూ నాటడం తోపాటు సంరక్షిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాలతో కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పరిధిలో అన్ని శాఖలను మార్గనిర్దేశం చేస్తూ లక్ష్యానికి మించి మొక్కలు నాటారు.
గ్రామాల్లో, రోడ్లకు ఇరువైపులా..
జిల్లాలోని అన్ని గ్రామాలతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో విరివిగా మొక్కలు నాటారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు మొక్కలు నాటేలా చర్యలు చేపట్టారు. రోడ్లకిరువైపులా నాటిన మొక్కలు స్వాగత తోరణంలా దర్శనమిస్తున్నాయి. మొక్కలు ఎండిపోకుండా వర్షాభావ పరిస్థితులను గమనించి ప్రతి రోజు నీరు అందించేలా గ్రామపంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూము ల్లో బ్లాక్ ప్లాంటేషన్ పేరిట పెద్ద ఎత్తున చిట్టడవులు పెం చారు. అర్బన్ ఫారెస్టు ఏరియా కింద అటవీ భూముల్లో కందకాలు తవ్వి మొక్కలు పెంచుతున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా స్టేట్ అండ్ నేషనల్ హైవేలతోపాటు ఆర్అండ్బీ రోడ్లు, గ్రామపంచాయతీ రోడ్ల పక్కన 1 నుంచి 3 వరుసల మొక్కలు పెంచారు. పల్లెప్రకృతి వ నాల్లో ప్రజలు సేదతీరేందుకు ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. అర్బన్ పార్క్ పేరిట నగరాలకు, పట్టణాల కు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటారు. ఇటీవల జరిగిన హరితహారం కార్యక్రమంలో ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. జిల్లాలో 2018లో 39,79,000, 2019లో 42,82,000, 2020లో 46,86,600, 2021లో 29,35,100.. మొ త్తం 1,58,82,700 మొక్కలు నాటారు.
నా పేరు లావణ్య. 25 ఏండ్లుగా వీరన్నపేటలో అద్దె ఇంట్లో ఉన్నాను. కూలి పని చేసుకుని బతికేటోళ్లం. నా భర్త మేస్త్రీ పనిచేస్తాడు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ మాకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నాం. ఇంటి వద్ద కిరాణం షాపు పెట్టుకున్నాను. ఖాళీ స్థలంలో పెరటి తోట పెంచుకుంటున్నాను. నా కొడుకు ఆటో నడుపుతాడు. ఇప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నాం. సొంత ఇంటి కల నెరవేరడం ఎంతో సంతోషాన్నిస్తున్నది. పేదల పక్షపాత ప్రభుత్వం ఉండబట్టే మాలాంటి పేదలకు పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది.
నా పేరు లక్ష్మి. మా ఆయన రాములు. పదేండ్లుగా వీరన్నపేట పాత గేట్ వద్ద కిరాయి ఉండేవాళ్లం. ఒకే రూమ్లో ఇద్దరు పిల్లలతో కష్టంగా గడిపాం. నా భర్త దివ్యాంగుడు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. ఆ ఇంటిలోనే చిన్న కిరాణం షాపు నిర్వహిస్తున్నాం. కూరగాయలు కూడా అమ్ముతున్నా. మంత్రి శ్రీనివాస్గౌడ్ మా పేదరికాన్ని గుర్తించి ఇల్లు ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా డబుల్ బెడ్రూం ఇల్లు రావడం సంతోషంగా ఉంది. రోడ్లు, డ్రైనేజీ, మిషన్ భగీరథ నీరు, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది.
పేదల కండ్లల్లో ఆనందం..
రాష్ట్రంలోనే పట్టణ ప్రాంతంలో అత్యధిక ఇండ్లను మహబూబ్నగర్లో నిర్మించాం. సీఎం కేసీఆర్ పేదల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి 4,350 ఇండ్లు మంజూరు చేశారు. దాదాపు అన్నీ పూర్తయ్యాయి. లక్నోలో నిర్వహించిన గృహ నమూనా ప్రదర్శనలో వీరన్నపేట డిజైన్ బాగుందని జాతీయ స్థాయి అధికారులు అభినందించారు. ఇల్లంటే ఒక రూం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. రెండు బెడ్రూంలు, కి చెన్, హాలు, ఇంటి ముందూ.. వెనకా ఖాళీ స్థలం ఉండేలా ఇక్కడి డ బుల్ ఇండ్లు ఆదర్శంగా ఉన్నాయి. లక్నో ప్రదర్శనలో ప్రశంసలు పొం దినందుకుగానూ ఇందుకు కృషి చేసిన కలెక్టర్ ఎస్.వెంకట్రావు, గృహ నిర్మాణ శాఖ ఈఈ వైద్యం భాస్కర్, సిబ్బందిని అభినందిస్తున్నా.
లక్ష్యానికి మించి మొక్కలు నాటాం.. : షేక్ యాస్మిన్ బాషా, కలెక్టర్, వనపర్తి జిల్లాలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. లక్ష్యానికి మించి మొక్కలు నాటుతున్నాం. ఈ కార్యక్రమంతో భవిష్యత్ తరాల మనుగడకు ఎంతో దోహదపడుతుంది. కాలుష్యం పెరుగుతున్న క్రమంలో పర్యావరణ పరిరక్షణకు ప్రయోజనకారిగా ఉంటుంది. పల్లెప్రకృతి వనాలు, అర్బన్ ప్లాంటేషన్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న పార్క్లు పట్టణ వాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అన్ని వర్గాలను భాగస్వాములు చేస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో కమిటీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని పర్యవేక్షిస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లకు ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేస్తున్నాం.