నేడు వినాయక చవితి
ఉత్సవాలకు సిద్ధమైన భక్తులు
మండపాలను సిద్ధం చేసిన యువత
మట్టి గణేశుల ప్రతిష్ఠపై మక్కువ
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో ముప్పు
కరోనా నిబంధనలు తప్పనిసరి
విఘ్నాలు తొలగించే వినాయకుడు నవర్రాతులు పూజలందుకోనున్నాడు. గణనాథులప్రతిమలు వాడవాడలా కొలువు దీరనున్నాయి. శుక్రవారం మండపాల్లో ప్రతిష్ఠించి కొలువనున్నారు. జైజై గణేశా.. జయములివ్వు గణేశా అంటూ.. భక్తులు స్మరించు కోనున్నారు. లంబోదరుల రాక కోసం గ్రామాలు, పట్టణాల్లోని చౌరస్తాల్లో నిర్వాహకులు మండపాలను సిద్ధం చేశారు. చిన్నా, పెద్ద, కులమతాలతో సంబంధం లేకుండా పండుగను సంబురంగా
నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణ కాలుష్యానికి ముప్పు పొంచి ఉన్నదని పర్యావరణ నిపుణులు
సూచిస్తున్నారు. అందుకే మట్టి గణపయ్యలే ముద్దని చెబుతుండడంతో వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పండుగతో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లన్నీ
కళకళలాడాయి.
వనపర్తి టౌన్/గద్వాల టౌన్, సెప్టెంబర్ 9 : ఆపదలో ఆదుకునునే ఆదిదేవుడు.. గడగడపకు వరాలిచ్చే గణనాథుడు.. విపత్కర పరిస్థితుల్లో ముందుండి నడిపించే నాయకుడు.. ముక్కోటి దేవతలచే తొలి పూజలు అందుకునే లంబోధరుడు.. గరిక పూజలకే సంబరపడే మంచి దేవుడు.. అలాంటి వినాయకుడు దివి నుంచి భువికి వచ్చేశాడు.. శుక్రవారం వినాయక చవితిని పురస్కరించుకుని వాడవాడలా కొలువుదీరేందుకు సిద్ధంగా ఉన్నాడు. భక్తుల కోరికలు తీర్చి అన్ని విధాలా రక్షణగా ఉండే గణనాథుడికి విశిష్ట పూజలు చేసేందుకు ప్రజలు సంసిద్ధులయ్యారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
ప్రకృతికి పెద్దపీట..
వినాయక చవితి.. మనిషికి, ప్రకృతికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రకృతిని దైవంగా భావించే సంస్కృతి హిందూ మతంలోనే ఉంది. వినాయక పూజలో ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో బోధపడుతుంది. వర్షఋతువుకు.. శరదృతువుకు మధ్య పుడమిపై పరుచుకునే పచ్చదనం వినాయక పూజా విధానంలో కనిపిస్తుంది. గణనాథుడిని ప్రతిష్ఠించిన తరువాత 21 రకాల ప్రకృతి సిద్ధమైన పత్రాలచే పూజిస్తారు. ఈ పత్రాలు ఎంతో ఉత్తమమైనవి. వీటితో ఎన్నో రకాల ఆయుర్వేద మందులను తయారుచేస్తారు. 21 రకాల ఆకులు, పూలతో పూజించడంలోనే మనిషి ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తాడో తెలియజేస్తుంది.
శ్రేష్ఠంగా పూజలు..
విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రాతి, రాగి, వెండి, బంగారంతో తయారుచేసి పూజిస్తారు. అందులో శ్రేష్ఠంగా నవరాత్రులు కొలిస్తే విజ్ఞాలు తొలగుతాయని ప్రజల నమ్మకం. రాత్రి పూట విఘ్నేశ్వరుడిని పూజిస్తే యోగం కలుగుతుందని, రాగి ప్రతిమను పూజిస్తే ఆరోగ్యం కలుగుతుందని, వెండి ప్రతిమను పూజిస్తే ఆయుష్షు పెరుగుతుందని, బంగారు ప్రతిమను పూజిస్తే సకల ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం.
నిమజ్జన కథనం..
తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణపతి.. గంగాదేవి గర్భంలో కొలువుదీరుతారనే స్కంధ పురాణం చెబుతున్నది. ఈ కథనం ఆధారంగా చెరువులు, నదుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఇలా నిమజ్జనం చేస్తే 21 రకాల పత్రాలు, గంధం, పసుపు, కుంకుమ, ఇతరత్రా మొక్కలతో వర్షాకాలంలో వచ్చిన కొత్త నీరు శుద్ధి అవుతుందని నమ్మకం.
ఘనంగా ఏర్పాట్లు..
వినాయకచవితిని వైభవంగా జరుపుకొనేందుకు ఉమ్మ డి జిల్లా వాసులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మండపాల ను అందమైన సెట్టింగ్లతో, విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రతిష్ఠించిన విగ్రహాల కు 3, 5, 9, 11 రోజులు ఇలా ఎవరికి తోచిన విధంగా వా రు పూజలు చేస్తారు. వినాయక చవితిపై కరోనా ఎఫెక్ట్ ప డింది. దీంతో పండ్లు, పూలు, ఆకు లు, వెలక్కాయ తదితర పూజా సామ గ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎల్లక్కాయ రూ.10 నుంచి రూ.30 విక్రయిస్తుండగా.. డజను అరటిపండ్లు రూ.50 దాటాయి. గరక, ఉత్తరేణి, గునుగుపూలు, చెరుకు కలిపిన కట్టను రూ.50-100 విక్రయిస్తున్నారు.
పూజలో వాడే పత్రాలు..
తులసి, రేగు, బిల్వం, రాగి, జమ్మి, నేల మునగ, జిల్లేడు, మర్వం, దానిమ్మ, విరజాజి ఆకు, గన్నేరు, ఉమ్మెత్త, గరిక, ఉత్తరేణి, మామిడి ఆకు, విష్ణుక్రాంత పత్రం, దేవదారు, వావిలిఆకు, దేవకాంచనం, వాకుడాకు, అర్జున పత్రం ఇలా 21 పత్రాలను స్వామికి సమర్పిస్తారు. నవరాత్రుల్లో 21 పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా వాటి నుంచి వెలువడే ప్రాణవాయువు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. అలాగే ఈ ఆకులను నీటిలో వేయడం ద్వారా నీటి శుద్ధి అవుతుంది. క్రిములు నాశనం అవుతాయి. ఒక్కో పత్రంలో ఒక్కో గుణం ఉంది. మాచిపత్రాలతో దురద పుండ్లు పోతాయి. గృహతి పత్రం ద్వారా శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. బిల్వ పత్రం ద్వారా మధుమేహం తగ్గుతుంది. గరక ద్వారా దురాలోచన, శత్రు బాధలు, గాయాలు మానుతాయి. నల్ల ఉమెత్తతో క్యాన్సర్, ప్రాణాంతక వ్యాధులు తొలగుతాయి. నబిల పత్రం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఉత్తరేణి ఆకులతో కంటి సమస్య తగ్గుతుంది. స్థిరబుద్ధి కలుగుతుంది. తులసిదళం పత్రాన్ని ఆయుర్వేదంలో వాడుతారు. గండకి పత్రంతో చర్మ దుర్వాసన పోతుంది. రాగి ఆకుతో ఉద్వేగ బాధలు పోయి బృహస్మతి అనుగ్రహం కలుగుతుంది. దేవదారి పత్రంతో చర్మసంబంధ వ్యాధులు తొలగుతాయి. గన్నేరు పత్రంతో ఉబ్బుసం నియంత్రణలోకి వస్తుంది. మామిడి, జాజి పత్రాలు జీర్ణకోశ సమస్యను పరిష్కరిస్తాయి. రావి పత్రం ఎముకలు, కీళ్ల వ్యాధుల నివారణకు దోహదపడుతాయి. జమ్మి ఆకుతో శని బాధలు తొలగుతాయి. అలాగే 21 రకాల ప్రసాదాలను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తారు. అటుకులు, కొబ్బరి, జిలక రసం, తాళ వెళ్లుల్లితో నైవేద్యం తయారు చేస్తారు.
తొమ్మిది రోజులు పూజలే..
ప్రతిరోజూ వినాయకుడు వివిధ రూపాల్లో పూజలు అందుకుంటాడు.
మొదటి రోజు విరసిద్ధి వినాయకుడిగా పూజలందుకొని ఉండ్రాల పాయాసాన్ని సమర్పిస్తారు.
రెండో రోజు వికట వినాయకుడిగా దర్శనం. అటుకుల ప్రసాదం సమర్పిస్తారు.
మూడో రోజు లంబోదరుడిగా.. పేలాలు (బొనుగులు) ప్రసాదం.
నాలో రోజు గజాననుడు.. చెరు కు రసాలను ప్రసాదాలుగా సమర్పిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం
ఐదో రోజు మహోదర వినాయకుడిగా.. కొబ్బర ప్రసాదాలు..
ఆరో రోజు ఏకదంత వినాయకుడిగా, సకల శక్తిమంతుడిగా దర్శనమిస్తాడు.
నువ్వులతో చేసిన వంటకాలు, నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు.
ఏడో రోజు వక్రతుండ వినాయకుడిగా.. అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. వక్రతుండ వినాయకుడిని పూజిస్తే రాజకీయ నాయకులకు పదవులు సంక్రమిస్తాయని నమ్మకం.
ఎనిమిదో రోజు ఎమ్రవర్ణ విజయగణపతి.. నేతి అప్పలు ప్రసాదం..
తొమ్మిదో రోజు విఘ్నరాజ గణపతి చేసి సత్తుపిండితో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
మొదటి రోజు పసుపును అద్ది పూజిస్తారు. వినాయకుడి అలంకరణ కు మొక్కజొన్నలు, సీతాఫలాలు, వెలగ పండ్లు, కలశంతో అలంకరిస్తారు. విఘ్నేశ్వరుడికి ఉండ్రా లు, పాయసం, లడ్డు ప్ర సాదం, ప్రీతిపాతమైన వంటకాలు సమర్పిస్తారు.