పరిగి, అక్టోబర్ 20 : మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమని వికా రాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో వెనుకబడిన తర గతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం వేట గాడుగా ఉన్న వాల్మీకి దొంగగా మారి దారి దోపిడీలు చేశారని, ఆ తర్వాత నారద మహా ముని దివ్యోపదేశంతో కొన్ని సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నారన్నారు. ఆ తర్వాత రామాయణ కావ్యాన్ని రచించారని చెప్పారు. మనిషిలో మార్పు వస్తే మహర్షి కాగలరు అని నిరూపించింది వాల్మీకి మహ ర్షి అని తెలిపారు. వాల్మీకి మహర్షి జీవితం మానవులకు ఆదర్శప్రాయమని, ఆయన జీవితాన్ని ముందు తరాలకు తెలియజేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రక మహ నీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ, వారిని స్మరించుకుంటుందని తెలిపారు. బీసీ కమీషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు మహర్షులవుతారని, వాల్మీకి మహర్షి చరిత్ర ఇందుకు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని పుష్పలత, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా స్థాయి అధికారులు, వాల్మీకి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు, అక్టోబర్ 20: వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను బుధవారం తాండూరు నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని వాల్మీకి దేవాలయంలో భక్తులు, నేతలు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్ మా ట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వాల్మీకి జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని తెలుపుతూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. వాల్మీకి మహర్షి తన తప్పు తెలుసుకొని జ్ఞానిగా దివ్యదృష్టితో రామాయణం రచించడం చరిత్రలో మరవలేనిదని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆదర్శంగా తీసుకోవాలి
కోట్పల్లి, అక్టోబర్ 20: వాల్మీకి జీవితాన్ని మానవళి ఆదర్శంగా తీసుకో వాలని బోయ వెంకటయ్య, మల్లేశం అన్నారు. బుధవారం మండలంలోని బుగ్గాపూర్ గ్రామ పంచాయతీలోని శివాలయం వద్ద వాల్మీకి జయంతి వేడు కలను నిర్వహించారు. కార్యక్రమంలో రఘు, జగదీశ్వర్, రాములు, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యువజన సంఘం ఆధ్వర్యంలో..
మర్పల్లి, అక్టోబర్ 20 : వాల్మీకి జయంతిని మర్పల్లి మండల కేంద్రంలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా పలువురు మాట్లాడుతూ ఆయన రచించిన రామాయణం గురించి వివ రించారు. కార్యక్రమంలో మల్లేశం, మధుకర్, శ్రీనివాస్, బల్ రామ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కులకచర్లమండల కేంద్రంలో ..
కులకచర్ల, అక్టోబర్ 20 : కులకచర్ల మండల కేంద్రంలోని బీజేపీ కార్యా ల యంలో నాయకులు వాల్మీకి మహార్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లా ద్రావు, నాయకులు ఘనాపురం వెంకటయ్యగౌడ్, మైపాల్, సంగెం శ్రీని వాస్, రవీందర్రెడ్డి, సురేందర్గౌడ్, అంజిలయ్య, శ్రీకాంత్, యాదయ్య, సంతోష్గౌడ్, వెంకటేశ్, పోచయ్య, బాలయ్య పాల్గొన్నారు.