నందిగామ, సెప్టెంబర్ 19 : మండలంలోని బండోనిగూడ రూపురేఖలు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మారాయి. ఊరంతా పరిశుభ్రంగా మారింది. ప్రతి కాలనీలో విశాలమైన సీసీ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలతో గ్రామంలో పచ్చదనం పరుచుకున్నది. ఆహ్లాదాన్ని పంచే చక్కటి ప్రకృతి వ నం. గతంలో చేగూర్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న బండోనిగూడ గ్రామంలో 811 జనాభా, 590 మంది ఓటర్లు ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. పాలకవర్గం ప్రత్యేక చొరవతో గ్రామం అన్నింటా ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రజల్లో పెరిగిన చైతన్యం..
పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చింది. తమ ఊరు బాగుండాలనే సంకల్పంతో స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించడం, తడి, పొడి చెత్త వేరు చేయడం, ఇంటి పరిసరాలను శు భ్రంగా ఉంచుకోవడం చేస్తున్నారు. గ్రామ అభ్యున్నతికి ప్రభు త్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. రూ.12.60లక్షలతో వైకుంఠధామం, రూ.1.68లక్షలతో కంపోస్ట్ యార్డ్, పల్లె ప్రగతి పనులు రూ.1.73వేలు, రూ.7.83లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచి నీటి సరఫరా, కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మాణం, వీధిలైట్లు ఏర్పాటు, ఇం కుడు గుంతల నిర్మాణం, వంద శాతం మరుగుదొడ్లు, డ్రైనేజీ వంటి పనులు పూర్తి చేసి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నారు.
పచ్చందాలు
ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ, గ్రామంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నర్సరీలో 12,000 మొ క్కలు, పల్లె ప్రకృతి వనంలో 3, 805, రోడ్లకు ఇరువైపులా 800, కమ్యూనిటీ హాల్, వైకుంఠధామం ఆవరణలో 1000 మొక్కలు నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామా న్ని స్వచ్ఛతగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి రోజు చెత్త సేకరించి కంపోస్ట్ యార్డుకు తరలించి, ఎరువును తయారు చేసి రైతులకు అందిస్తున్నాం. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితో అధికారులు, గ్రామస్తుల సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం. రానున్న రోజుల్లో అన్ని విధాలుగా మౌలి క వసతులు కల్పించి బండోనిగూడ గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
సమస్యలు తొలగిపోయాయి..
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ఉన్న సమస్యలు తొలిగిపోయాయి. ప్రతి రోజూ చెత్తను కంపొస్టు యార్డుకు తరలించడం, డ్రైనేజీ, రోడ్లను శుభ్రం చేయడం, మొక్కల పెంపకంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. గ్రామంలో వైకుంఠధామం, కంపోస్ట్యార్డు, సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.