కడ్తాల్, సెప్టెంబర్ 12 : కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుగొమ్మలని, పార్టీ కోసం పని చేసే వారికి పదవులు లభిస్తాయని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని గోవిందాయిపల్లి తండా కమిటీని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ గోవిందాయిపల్లి తండా అధ్యక్షుడిగా ఛత్రునాయక్, ఉపాధ్యక్షుడిగా రమేశ్నాయక్, కార్యదర్శిగా సోమ్లానాయక్, రైతు కమిటీ అధ్యక్షుడిగా గోప్యనాయక్, ఉపాధ్యక్షుడిగా మధునాయక్, గౌరవాధ్యక్షుడిగా బిక్కునాయక్, యువజన విభాగం అధ్యక్షుడిగా వినోద్, ఉపాధ్యక్షుడిగా మల్లేశ్, కార్యదర్శిగా కుమార్, కార్యవర్గ సభ్యులుగా గన్యా, శివరాం, మున్యా, భాస్కర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రేఖ్యాతండా సర్పంచ్ హరిచంద్నాయక్, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్లు శిరిషా, శారద, నాయకులు సంతోష్నాయక్, గోప్యనాయక్, భాస్కర్, పాండునాయక్, శ్రీనునాయక్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక
తలకొండపల్లి సెప్టెంబర్ 12 : మండల పరిదిలోని తలకొండపల్లి, చెన్నారం గ్రామాల టీఆర్ఎస్ కమిటీలను సర్పంచ్ స్వప్న, మాజీ జడ్పీటీసీ నర్సింహ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తలకొండపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పెరుమాండ్ల ఆంజనేయులు, ఉపాధ్యక్షుడిగా విజయ్కుమార్, కార్యదర్శిగా మల్లేశ్ , సంయుక్త కార్యదర్శిగా కుమార్, బాలస్వామి, కోశాధికారి రమేశ్, చెన్నారం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాములు, ఉపాధ్యక్షుడిగా రాత్లవత్ శంకర్, కార్యదర్శిగా నర్సింహ, సంయుక్త కార్యదర్శిగా మద్దేరి మహేశ్, కోశాధికారిగా రామకృష్ణ, ప్రచార కార్యదర్శిగా రమేశ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్ష ఉపాధ్యక్షులు మల్లేశ్, లక్ష్మీకాంత్గౌడ్, భాస్కర్రెడ్డి, సజ్జుపాష, శేఖర్, రమేశ్ పాల్గొన్నారు.
లింగంపల్లి, కాగజ్ఘట్లో కమిటీలు ఎన్నిక..
మంచాల సెప్టెంబర్ 12 : లింగంపల్లి, కాగజ్ఘట్ టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీలను మండలాధ్యక్షుడు చీరాల రమేశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. కాగజ్ఘట గ్రామశాఖ అధ్యక్షుడిగా యాట సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఎండీ ఖాధిర్, ఉపాధ్యక్షుడు జగదీశ్, కోశాధికారి పంది శేఖర్, కార్యదర్శి పూజారి సంతోష్, ప్రధాన కార్యదర్శి కందుకూరి నాగేశ్, లింగంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాచకొండ పరమేశ్, ప్రధాన కార్యదర్శిగా అశోక్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ బుస్సుపుల్లారెడ్డి, సర్పంచ్లు నౌసు హరిప్రసాద్, అండాలు, నాయకులు బియ్యని జ్ఞానేశ్వర్, ఏర్పుల చంద్రయ్య, చిందం రఘుపతి, మొగిలి వెంకటేశ్, కే రాంరెడ్డి, జంగారెడ్డి, కందాల శ్రీశైలం, యాట జంగయ్య, నూతన గంటి శేఖర్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో మరింత బలోపేతం చేస్తాం
పెద్దఅంబర్పేట, సెప్టెంబర్ 12 : మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బలరాం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, 23వ వార్డు కౌన్సిలర్ కృష్ణారెడ్డి అన్నారు. పలు వార్డుల్లో ఎన్నికైన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. 23వ వార్డు అధ్యక్షుడికి కోట మల్లికార్జున రావు, యూత్ అధ్యక్షుడిగా నిఖిల్రెడ్డిని ఎన్నుకున్నారు. పార్టీ అనుభంధ సంఘాల కమిటీలను కూడా ఎన్నుకున్నారు. వార్డు ఎన్నికల అధికారిగా విజయభాస్కర్రెడ్డి వ్యవహరించగా కౌన్సిలర్ విద్యావతి, బాంక్ డైరెక్టర్ ప్రభాకర్రెడ్డి, విజయేందర్రెడ్డి, మహేందర్రెడ్డి, గోపాల్గౌడ్, జగన్, ఇర్ఫాన్, కృష్ణ చైతన్య పాల్గొన్నారు. నాల్గవ వార్డు అధ్యక్షుడిగా బాలకృష్ణను కౌన్సిలర్ విద్యావతి ఆధ్వర్యంలో ఎన్నుకోగా, 12వ వార్డు అధ్యక్షుడిగా అంబటి సత్యంరాజును ఎన్నుకున్నారు.
జోరుగా గ్రామ కమిటీల ఎన్నిక
యాచారం, సెప్టెంబర్ 12 : మండలంలోని మాల్, తులేఖుర్ధు గ్రామ కమిటీలను టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మాల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నల్లవెల్లి జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా గులాం సోహెల్, ఉపాధ్యక్షుడిగా తోకల అశోక్, సంయుక్త కార్యదర్శిగా నిమ్మరాజు, కోశాధికారి నరేందర్రెడ్డి, యూత్ అధ్యక్షుడిగా రాము, సోషల్మీడియా అధ్యక్షుడిగా వంశీని ఎన్నుకున్నారు. పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో తులేఖుర్ధు అద్యక్షుడిగా అంకని రమేశ్, ప్రధాన కార్యదర్శిగా బొమ్మిశెట్టి శేఖర్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సబిత, నర్సిరెడ్డి, కృష్ణ, ఎంపీటీసీలు ఇస్రత్బేగం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు రమేశ్, మల్లేశ్, శివ, శ్రీశైలం, సత్యపాల్ తదితరులున్నారు.
వార్డు కమిటీల ఎన్నిక పూర్తి..
తుర్కయాంజాల్, సెప్టెంబర్ 12 : మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో టీఆర్ఎస్ కమిటీల ఎన్నిక పూర్తయ్యింది. ఇంజాపూర్లో గోపాల్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బలదేవరెడ్డి సమక్షంలో 14, 24 టీఆర్ఎస్ వార్డు కమిటీలను ఎన్నుకున్నారు. 14వ వార్డు అధ్యక్షుడిగా పెసరగాయల సత్తిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎండీ ఆసిన్, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, సంయుక్త కార్యదర్శిగా అశోక్ గౌడ్, కోశాధికారిగా బొక్క ఇంద్రసేనా రెడ్డి, ప్రచార కార్యదర్శిగా మహేశ్, సలహాదారులుగా నరసింహా రెడ్డి, పాపయ్య గౌడ్, డి.శ్రీకాంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. యువజన విభాగం అధ్యక్షుడిగా పడమటి మహేందర్గౌడ్, ప్రధాన కార్యదిర్శిగా ఎండీ నజీర్ను ఎన్నుకున్నారు. 24వ వార్డు అధ్యక్షుడిగా పసునూరి భగవత్, ఉపాధ్యక్షుడిగా భాస్కర్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ రెడ్డి, కోశాధికారిగా ఎన్.పరమేశ్వర్, యువజన విభాంగం అధ్యక్షుడిగా కేతావత్ కృష్ణకాంత్, ప్రధాన కార్యదర్శిగా గోపాల్ నాయక్ను ఎన్నుకున్నారు. ఒక్కో వార్డులో ఐదు కమిటీల చొప్పున ఎంపిక చేశామని తెలిపారు.
వార్డు కమిటీల ఎన్నిక
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 12 : మున్సిపాలిటీలోని 10, 12, 18, 19 వార్డులకు నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ అధ్యక్షుడు గోపగల్ల బాబు, నాయకులు గోపాల్గౌడ్, కోరె జంగయ్య ఆధ్వర్యంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు. 1వ వార్డు అధ్యక్షుడిగా భూపతిగల్ల రాము, 9వ వార్డు అధ్యక్షుడిగా పల్లె రాకేశ్, 10వ వార్డు అధ్యక్షుడిగా వెంకటేశ్ను ఎన్నుకున్నారు. 10వ వార్డు అధ్యక్షుడిగా పంది మహేందర్, 12వ వార్డు అధ్యక్షుడిగా కొండిగారి త్రిలోక్, 18వ వార్డు అధ్యక్షుడిగా బస్వాపురం పరమేశ్, 19వ వార్డు అధ్యక్షుడిగా ముత్యాల నవీన్కుమార్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జగదీశ్యాదవ్, ఇందిరాల రమేశ్, కప్పరి చందు, ఆకుల సురేశ్, కేవీ రమేశ్రాజు, మడుపు వేణుగోపాల్, గాజుల గోపాల్, అరవింద్, ముజాకిర్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.