ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
రూ.70 లక్షలతో మైసమ్మతల్లి ఆలయ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన
కడ్తాల్, సెప్టెంబర్ 3 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారని, మైసిగండిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మైసిగండిలో మైసమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో రూ.70 లక్షలతో నిర్మిస్తున్న ప్రహరీ శంకుస్థాపనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. మైసిగండి ఆలయ అభివృద్ధితో పాటు మైసిగండిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సహకరిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అంతకుముందు మైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దర్శించుకొని పూజలు నిర్వహించారు.
టాయిలెట్స్ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు..
ఆలయ ఆవరణలో టాయిలెట్స్ నిర్మించాలని వైస్ ఎంపీపీ ఆనంద్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే జైపాల్యాదవ్ టాయిలెట్స్ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఆలయ ఆవరణలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.5 లక్షలు జడ్పీటీసీ దశరథ్నాయక్ మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, తహసీల్దార్ జ్యోతి, ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలీ, ఆలయ ఈవో స్నేహలత, సర్పంచ్ తులసీరాంనాయక్, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్ రాజారాం, ఆలయ నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, నాయకులు భాస్కర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వీరయ్య, శేఖర్గౌడ్, జహంగీర్అలీ, నరేశ్నాయక్ పాల్గొన్నారు.