శంషాబాద్ : విమానాల మరమ్మతుల కోసం ఉపయోగించే ఎలక్టానిక్ యంత్రాలు మాయమైన ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో విభాగంలో ఆదివారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ పోలీసుల వివరాల ప్రకారం… శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టర్బోజెట్ ఇంజన్ సంస్థ సిబ్బంది మరమ్మతులు చేస్తుంటారు.
బీహార్కు చెందిన కుమార్, మణిపూర్కు చెందిన ప్రతాప్ సంస్థలో మేనేజర్లు. కాగా నెల క్రితం ఇద్దరూ సెలవులపై స్వస్థలాలకు వెళ్లారు. గడువు ముగిసినా తిరిగి రాలేదు. ఫోన్ల కమ్యూనికేషన్ కూడ లేదు. అధికారులకు అనుమానం వచ్చిఆ విభాగంలో తనిఖీ చేశారు. సుమారు రూ. 50 లక్షల విలువైన యంత్ర సామాగ్రి చోరీ జరిగినట్లు గుర్తించారు.
ఈ మేరకు శంషాబాద్ ఆర్జిఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.