బండ్లగూడ: పశువుల్లో బ్రూసెల్లాసిస్ వ్యాధి సోకకుండా రాజేంద్రనగర్ పశువైద్య అధికారి శ్రీకాంత్ పశువులకు టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభించారు.మంగళవారం గగన్ పహడ్లోని సత్యం శివం సుందరం గోశాలలో ఆయన లేగ దూడలకు ఉచితంగా బ్రూసెల్లాసిస్ వ్యాధి నిరోధక టీకాలను వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నుంచి ఎనిమిది నెలల వయస్సు ఉన్న ఆడ లేగ దూడలకు బ్రూసెల్లాసిస్ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు.
ఈ వ్యాధి పశువులలో అనారోగ్యాన్ని కల్గించడమే కాకుండా మనుషులకు కూడ వ్యాపించే అవకాశం ఉందన్నారు.ఈ వ్యాధిని నివారించేందుకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మందులను పంపిణి చేయడం జరుతుందన్నారు. పశువులకాపరులు గ్రామంలోకి వచ్చినప్పుడు తమను సంప్రదించి పశువులకు టీకా వేయించాలన్నారు.ఈ కార్యక్రమం లో పశువైద్యాధికారి డాక్టర్ అంజిలప్ప,విజయకుమార్రెడ్డి,డాక్టర్ కృష్ణయ్య. సిబ్బంది అభిజిత్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.