బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 6లక్షల మంది పిల్లలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. 15సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు 22.78 లక్షల మంది ఉన్నారని, వారందరికీ వ్యాక్సిన్ వేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 2.35లక్షల మంది వ్యాక్సినేషన్ వేసుకునే వారిని గుర్తించడం జరిగిందన్నారు. పాఠశాలలు, కళాశాలల యజమానులు విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించడానికి చొరవ తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పై బడిన వారు వ్యాక్సిన్ వేయించుకోక పోతే వేసుకోవాలని ఆమె సూచించారు.
ప్రతి ఒక్కరు బౌతిక దూరం పాటిస్తు తప్పని సరిగా మాస్క్లు దరించాలన్నారు. వ్యాక్సిన్ కార్యక్రమంలో తెలంగాణ ముందు వరసలో ఉందన్నారు. కరోనా ప్రభావం విద్యారంగం పై తీవ్రంగా పడిందన్నారు. కొవిడ్ వలన ప్రాణ నష్టం జరగ కుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని ఆమె తెలిపారు.
అన్ని ఆసుపత్రులలో బెడ్స్ సిద్దంగా ఉంచామని అన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం రూ. 25లక్షలతో నిర్మించిన వెయింటింగ్ హల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డిఇఇ గోపినాథ్, కార్పొరేటర్స్ సిద్దాల లావణ్య బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, అక్కి మాదవి ఈశ్వర్ గౌడ్, ధనలక్ష్మి రాజ్కుమార్ అతదితరులు ఉన్నారు.