మన్సూరాబాద్ : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. హన్మకొండ దీన్దయాల్ కాలనీకి చెందిన పట్టూరి సోమేశ్వర్, కళావతి దంపతుల కుమార్తె సింధు వివాహం ఇటీవల నిశ్చయమైంది.
సోమేశ్వర్, కళావతి దంపతుల ఆర్థిక పరిస్థితిపై కొందరు సన్నిహితులు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఆయన స్పందించి ఉప్పల ఫౌండేషన్ చేయూతతో సింధు వివాహానికి పుస్తె, మట్టెలు, చీర, గాజులను ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతులమీదుగా వదువుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబా లలో జరుగుతున్న వివాహాలకు పుస్తె, మట్టెలు, చీర, గాజులను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్, మీడియా కమిటీ చైర్మన్ గంగిశెట్టి రఘు గుప్తా, సికింద్రాబాద్ జోన్ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్, సభ్యులు ప్రశాంత్, వై. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.