బండ్లగూడ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన శైమాల్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్వీనర్ రగడం పల్లి శ్రవణ్కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్జి పెట్టుకున్నారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన రెండు లక్షల ఎల్వోసీని బాధితునికి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ నాయకులు పలుగు చెరువు మహేష్, సయ్యద్ ముజమిల్ అహ్మద్, సాయి మాలిక్ తదితరులు ఉన్నారు.