రామగిరి, జనవరి 17 : వ్యాయామ ఉపాధ్యాయ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ట్(టీఎస్ పీఈసెట్-2022) బాధ్యతను నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మళ్లీ అప్పగించింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి. 2017 నుంచి ఇక్కడ విజయవంతంగా నిర్వహిస్తుండడంతో ఈసారీ అవకాశం కల్పించింది. ఎంజీయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ను ప్రొఫెసర్ వి.సత్యనారాయణను కన్వీనర్గా నియమించింది.
రామగిరి, జనవరి 17 : ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్పీఈసెట్-2022) నిర్వహణ బాధ్యతను మళ్లీ మహాత్మాగాంధీ యూనివర్సిటీకే రాష్ట్ర ఉన్నత విద్యామండలి అప్పగించింది. విశాలమైన క్రీడా మైదానాలు అందుబాటులో ఉండడం, విజయవంతంగా పరీక్షలు నిర్వహిస్తుండడంతో మరోసారి అవకాశం కల్పించింది. 2017 సంవత్సరం నుంచి ఎంజీయూ టీఎస్పీఈసెట్ నిర్వహిస్తున్నది. టీఎస్ పీఈసెట్ కన్వీనర్గా ఎంజీయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, ప్రొఫెసర్ వి.సత్యనారాయణను నియమిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సోమవారం ఎంజీయూలో ఉత్తర్వులు అందించారు.
బీపీఈడీలో 1,690, యూజీడీ పీఈడీలో 350 సీట్లు..
వ్యాయామ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ప్రతియేటా టీఎస్ పీఈసెట్ నిర్వహిస్తున్నది. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా(యూజీడీ పీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీలో 1,610, యూజీడీపీఈడీలో 350 సీట్లు ఉన్నాయి. ఎంజీయూ పరిధిలో బీపీఈడీ 4, యూజీడీపీఈడీ 2 కళాశాలల్లో సీట్లు ఉన్నాయి.
మైదానాలతోనే..
ఎంజీయూ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లే దారిలో కుడి వైపున క్రీడా మైదానాలు నిర్మించారు. వీటిలో ఖోఖో, కబడ్డీ, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్బాల్, వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి. మైదానాలను కలుపుతూ ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేశారు. ఇండోర్ స్టేడియం పనులు వేగంగా సాగుతుండగా ఈ పర్యాయం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నప్పటికీ ఈ బాధ్యతను మరోసారి అప్పగించడంతో అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.