సైదాపూర్/చిగురుమామిడి, జనవరి 19: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన సందవేని కొమురయ్య, సీతారాంపూర్ గ్రామానికి చెందిన ఒంటెల రాజిరెడ్డి, సైదాపూర్ మండలం జాగీర్పల్లి గ్రామానికి చెందిన దొడ్డి రాజయ్య ఇటీవల మృతిచెందారు. వీరు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోగా బీమా సొమ్ము రూ. 2 లక్షల చొప్పున మంజూరయ్యాయి. కాగా, హుస్నాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ బుధవారం బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీకి కార్యకర్తలే పునాది అని పేర్కొన్నారు. బీమా సొమ్ము అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్కు బాధిత కుటుంబాలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హన్మకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, సింగిల్విండో చైర్మన్లు బిల్ల వెంకటరెడ్డి, జంగా వెంకటరమణ రెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ ఎంపీపీ అందె సుజాత, మారెట్ కమిటీ డైరెక్టర్ అందె పోచయ్య, సర్పంచులు తొంట కాంతమ్మ, సన్నీల్ల వెంకటేశం, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ తొంట ఓదెలు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు పోలుదాసరి ప్రవీణ్, ఎస్కే సిరాజ్, ఆర్బీఎస్ గ్రామ కో-ఆర్డినేటర్ ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు ముకెర సదానందం, తొంట రజినీకాంత్, బత్తుల లక్ష్మీనారాయణ, దుద్దనపల్లి ఉప సర్పంచ్ పోతిరెడ్డి హరీశ్రావు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.