బండ్లగూడ : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి పది తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడ జాగీర్ పరిధిలోని అభ్యుదయ నగర్లో నివాసం ఉండే శ్రీకాంత్రెడ్డి తన భార్య అత్తగారి ఇంటికి వెళ్లడంతో మంగళవారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు.
తిరిగి రాత్రి అలస్యంగా ఇంటికి వచ్చి నిద్రపోయాడు. తెల్లవారు జామున తన గదిలోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పూర్తిగా పరిశీలించగా అందులో ఉన్న 10 తులాల బంగారం పోయినట్లు గుర్తించారు. అనంతరం బుధవారం ఉదయం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.