హిమాయత్నగర్ : ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని నవజంట కేశపాకు పృథ్విరాజ్ (25), జీడికపల్లి మానస నగర పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు.గురువారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ..
ఎంబీఏ చదువుతున్న తరుణంలో తమ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని తెలిపారు. ఇద్దరం కలిసి జీవించాలని నిర్ణయించుకుని ఇష్టపూర్వకంగా ఈ నెల 11న రామంతాపూర్లోని శ్రీరామ సహిత సత్యనారాయణ దేవాలయంలో వివాహం చేసుకుని 17న బంజారా హిల్స్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వారు తెలిపారు.
విషయం తెలుసుకున్న మానస తల్లిందండ్రులు పృథ్వీరాజ్కు ఫోన్చేసి చంపు తామని బెదరింపులకు పాల్పడుతున్నారని వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.