బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్
పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెందిన గువ్వల నరేందర్రెడ్డి (33) ఫిలింనగర్ రోడ్ నెం 92లో నివాసం ఉంటూ ఆఫీస్ భాయ్గా పనిచేస్తున్నాడు.
మూడేళ్ల క్రితం నరేందర్రెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అప్పటినుంచి మందులు వాడుతున్నాడు. గత కొంతకాలంగా మందులు వేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 9న బాత్రూమ్లోకి వెళ్లిన నరేందర్రెడ్డి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దాంతో అనుమానం వచ్చిన అతడి స్నేహితులు కిటికీలోంచి చూడగా అపస్మారక స్థితిలో కిందపడిపోయి కనిపించాడు.
దాంతో తలుపులు పగలగొట్టి అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాత్రూమ్లో ఉన్నప్పుడు బ్రెయిన్స్ట్రోక్ రావడంతో కుప్పకూలి ఉంటాడని బావిస్తున్నారు. ఈ మేరకు మృతుడి సోదరుడు సత్యనారాయణరెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.