పటాన్చెరు, జనవరి 16 : అందరినీ ఆదరించడమే తెలంగాణ సంప్రదాయమని, శ్రీకాకుళం వాసులకు అండగా ఉంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని పటాన్చెరు శ్రీకాకుళం అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన శ్రీకాకుళం వాసులు అధికంగా ఉన్నారని గుర్తు చేశారు. మా ప్రాంత అభివృద్ధిలో శ్రీకాకుళంవాసులతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పాత్ర అధికంగా ఉందన్నారు. వీరంతా కష్టజీవులని కొనియాడారు. స్థానికంగా రెండో, మూడో తరం ప్రస్తుతం ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఇక్కడ స్థానికులేనని తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తామని హామీనిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గం అన్ని రాష్ర్టాల ప్రజలు సొంత ప్రాంతాలు గానే భావిస్తారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ అన్ని రాష్ర్టాల ప్రజలకు సంక్షేమం అందేలా చూడాలని కోరారన్నారు. మినీ ఇండియాలో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవడం సంప్రదాయం అన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్రాజు, పృథ్వీరాజ్, అంతిరెడ్డి, వాసు, భాస్కర్, యోగనంద్, సురేశ్, లోకేష్, తిరుపతిరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.