బన్సీలాల్పేట్ : పొట్టి శ్రీరాములు నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ వద్ద నిర్మించిన అమ్మవారి నూతన ఆలయాన్ని బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయంలో ఉజ్జయినీ మహంకాళి ఆలయ ప్రధాన అర్చకులు, వేదబ్రాహ్మణుల చేత శ్రీనల్లపోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన హోమం, ప్రత్యేక పూజలలో మంత్రి శ్రీనివాస్ యాదవ్తో పాటు ఆయన సతీమణి సువర్ణ, కుమారుడు సాయికిరణ్ యాదవ్ దంపతులు, సోదరుడు రవీందర్ యాదవ్, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ హేమలత పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు జీ.పవన్కుమార్ గౌడ్, కె.లక్ష్మిపతి, వెంకటేశన్ రాజు, బస్తీ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, ఆలయ కమిటి అధ్యక్షుడు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.