కవాడిగూడ : నిరుపేదలను ఆదుకునేందుకు సామాజిక సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినంద నీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడ డివిజన్ తాళ్లబస్తీలోని కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ అంబులెన్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సాయి అంబులెన్స్ సర్విస్ మాజీ ప్రొప్రైటర్ గంగాదరీ ప్రసన్నవాణి వర్ధంతిని పురస్కరించుకొని నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సేవా దృక్పదాన్ని పెంపొందిచుకున్నపుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. సాయి అంబులెన్స్ సర్విస్ ద్వారా ప్రసన్నవాణి ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆమె జ్ఞాపకార్ధం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కార్పొరేటర్ శాంతి, అసోసియేషన్ సభ్యులు నిఖిల్, గాయిత్రి, శంకర్ రెడ్డి, కుమార్, వెంకటేశ్, బలరామ్ తదితరులు పాల్గొన్నారు.