వేల్పూర్, జనవరి 12: వ్యవసాయం అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.3లక్షల కోట్లు ఖర్చు చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేం ద్రంలో రైతుబంధు వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఉత్సవాల్లో మంత్రితోపాటు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత వ్యవసా యం ఎలా ఉందో కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నదన్నా రు. రైతుల ఆకాంక్షలను తీర్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. బీడు భూములన్నీ ఇంచు ఖాళీ లేకుం డా పచ్చబడ్డాయన్నారు. కేసీఆర్ ద్వారానే రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకంతో మోతె గ్రామస్తులు కేసీఆర్ వెం ట నడిచారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. రైతుబంధు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రైతుబంధు కోసం రైతులు ఎలాంటి పైరవీలు చేయాల్సి న అవసరంలేకుండా సాగు సమయానికి వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని వివరించారు. ఉద్యోగుల జీతాలు ఆపుదాం.. కానీ రైతుబంధు సహాయం ఆపొద్దని కేసీఆర్ చెప్పారు. రైతుబంధు కొద్దిరోజులే ఇస్తారని తప్పుడు ప్రచారం చేశారని, ఎనిమిది విడుతలుగా రైతులకు ఇప్పటి వరకు రూ.50వేల కోట్లు ఇచ్చారన్నారు. రైతుబంధు అందుకుంటున్న వారంతా సంబురాలు చేస్తుంటే కేసీఆర్పై రైతుల ప్రేమ తెలుస్తున్నదన్నారు. రైతుబంధు పథకం ద్వారా బాల్కొండ నియోజకవర్గ రైతులకు రూ.454 కోట్లు అందుతున్నాయన్నారు. ప్రపంచంలో రైతులకు ఎవ్వరూ ఇవ్వని భరోసా కేసీఆర్ ఒక్కరే ఇచ్చారన్నారు. ఆరేండ్ల క్రితం రూ.5లక్షలకు ఎకరం భూమి ధర ఉంటే, నేడు రూ.30లక్షలకు పైగా పలుకుతుందన్నారు. భూముల ధరలు పెరిగి రైతు ధనవంతుడు అయ్యిండన్నారు. నీటి వనరులు పుష్కలంగా లభించడంతోపాటు ఉచిత కరెంటు, రైతుబంధుతో భూముల ధరలు పెరిగాయన్నారు. ఒకప్పుడు ఆంధ్రోళ్లు తెలంగాణ భూములు కొనేవారని, నేడు తెలంగాణ రైతులు ఆంధ్రాకు వెళ్లి భూములు కొంటున్నారని తెలిపారు. ఇది కేసీఆర్తో జరగలేదా? బీజేపీ పాలిత రాష్ర్టాల నుంచి కూలీలు తెలంగాణకు రావడం లేదా? తెలంగాణ వాళ్లు బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్కు వెళ్తున్నారా? అని ప్రశ్నించారు.
సవాల్కు సిద్ధమా?
కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు, సాగునీరు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇస్తున్నారా? నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. బండి సంజయ్,అర్వింద్లు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని మంత్రి సవాల్ విసిరారు. గెలిచిన 5రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఎంపీ అర్వింద్ మాటతప్పాడని విమర్శించారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోవిం ద్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి,ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఏడీఏ మల్లయ్య, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోహన్రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ ఏలేటి మోహన్, సర్పంచ్ తీగల రాధ, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, వైస్ ఎంపీపీ బోదపల్లి సురేశ్, ఎంపీటీసీ మొండి మహేశ్, గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్ సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
అబద్ధపు ప్రచారాలు చేయొద్దు
రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నది ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నదని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో లేనిపోనివి పోస్ట్చేస్త్తూ కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారు ఒక్కసారి ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు, వాగులు, వ్యవసాయ భూములు గతంలో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ కృషితో వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
ఊరూరా.. ఉత్సాహంగా..
ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలను బుధవారం వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు.
సవాల్కు సిద్ధమా?
కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు, సాగునీరు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇస్తున్నారా? నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. బండి సంజయ్,అర్వింద్లు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని మంత్రి సవాల్ విసిరారు. గెలిచిన 5రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఎంపీ అర్వింద్ మాటతప్పాడని విమర్శించారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోవిం ద్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి,ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఏడీఏ మల్లయ్య, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోహన్రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ ఏలేటి మోహన్, సర్పంచ్ తీగల రాధ, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, వైస్ ఎంపీపీ బోదపల్లి సురేశ్, ఎంపీటీసీ మొండి మహేశ్, గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్ సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
అబద్ధపు ప్రచారాలు చేయొద్దు
రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నది ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నదని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో లేనిపోనివి పోస్ట్చేస్త్తూ కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారు ఒక్కసారి ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు, వాగులు, వ్యవసాయ భూములు గతంలో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ కృషితో వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.