జూబ్లీహిల్స్ : కైస్తవులు క్రిస్మస్ పర్వదినం కంటే ముందే నిర్వహించుకునే సెమీ క్రిస్మస్ వేడుకలను జూబ్లీహిల్స్ క్రిష్టియన్ ఫోరం అత్యంత వైభవంగా నిర్వహించనుండడం అభినందనీయమని ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ అన్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 11 న యూసుఫ్గూడలో నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ ఏర్పాట్లపై బుధవారం జూబ్లీహిల్స్ క్రిష్టియన్ ఫోరం నిర్వహించిన సమావేశంలో క్రిష్టియన్ మైనార్టీ వైస్ ఛైర్మెన్ శంకర్లూక్, బిషప్ విద్యాసాగర్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్టీవెన్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతో పాటు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించిందని అన్నారు. ప్రధానంగా కైస్తవులు ఘనంగా జరునుకునే క్రిస్మస్ను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత ఘనంగా నిర్వహించడం ముదావహమన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ స్వయంగా 5 వేల మంది కైస్తవులకు వ్యక్తిగతంగా కానుకలు ఇవ్వడంతో పాటు అట్టహాసంగా విందు ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్రిష్టియన్ ఫోరం ప్రతినిధు లు డాక్టర్ ఏసురాజు, రెవ.జోసఫ్ నాగేశ్వర్, విజయ్ కుమార్, పాస్టర్ సూర్య, రాకేష్, డేవిడ్, విలియం, బాబురావు, వసంత్ రావు తదితరులు పాల్గొన్నారు.