సైదాబాద్ : భార్యపై అనుమానంతో నిద్ర పొతున్న ఆమెపై గొడ్డలితో దాడిచేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం ప్రకారం…సైదాబాద్ సింగరేణికాలనీలో నివసించే సాధు, యాదమ్మ దంపతులు. వీరికి ఆరేండ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
స్థానికంగా కూలీ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. దంపతుల మద్య వైవాహిక జీవితంలో సమస్యలు రావటంతో సాధు గత కొంతకాలంగా భార్యపై అనుమానిస్తూ, తరుచూ గొడవలు పడుతున్నాడు. శనివారం రాత్రి కూడా అమెతో ఘర్షణపడి ఇంట్లో ఉన్న గొడ్డలితో అమెపై దాడి చేశాడు.
దీంతో గాయపడ్డ అమె కేకలు వేసుకుంటూ బయటకు రావటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాయపడ్డ యాదమ్మను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. సాధును అదుపులోకి ఆదివారం రిమాండ్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.