ఎల్బీనగర్ : ప్రపంచంలోకెల్లా గొప్పది భారత రాజ్యాంగమని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తపేటలో ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్ని దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి భారత దేశానికి పఠిష్ట రాజ్యాంగాన్ని రుపొందించారని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి ద్వారా నే 140 కోట్ల మంది భారతీయులు తమ హక్కులను పొందుతున్నారని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీ యుడని ఎమ్మెల్యే కొనియాడారు.
ఈ సందర్భంగా ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రుపొందించిన క్రిమినల్ ఆర్డ్ పుస్తకాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆవిష్కరించారు. ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, ప్రధాన కార్యదర్శి బి. సురేందర్ కుమార్లు మాట్లాడుతూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిరుపేదలు, బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు అసోసియేషన్ అండగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పవన్కుమార్, చింతల అరుణ, హైకోర్టు న్యాయవాదులు సి. నరేందర్, కె. శ్రీనివాస్, ఎం. సత్యనారాయణరెడ్డి, న్యూ నాగోలు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సుమతిరెడ్డి, స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనంతుల సురేందర్రెడ్డి , సీనియర్ నాయకుడు అనంతుల రాజారెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు విష్ణుమూర్తి, శివకుమార్, నీరజ్ ఠాకూర్, ఎన్. సంతోష్కుమార్, జి. స్వరూప, పి. ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.