శంషాబాద్ రూరల్ : రైతులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం మండలంలోని పాలమాకుల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ కే శ్రావణ్గౌడ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంతోనే దేశంలో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2018లో రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి 50వేల కోట్ల రూపాయలను రైతులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు.
ఒక్క శంషాబాద్ మండలంలోనే ఇప్పటీ వరకు రైతు బంధు పథకం కింద 50కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమచేశామని దీంతో పాటు రైతు బీమా ద్వారా 108 మందికి 5కోట్ల 40 లక్షల రూపాయలు అందించిన్నట్లు చెప్పారు. అంతకు మందు చైర్మన్ శ్రావణ గౌడ్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం కోసం పెద్దషాపూర్ గ్రామంలో 20 సర్వే నంబర్లో రెండు ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు.
దీంతో పాటు పీఏసీఎ సీ ప్రహరీగోడ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అవసరమైన నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలభిఫేకం నిర్వహించారు.
కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జిల్లా పరిషత్ ఫ్లోర్లీడ ర్ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ సతీష్యాదవ్, ఎంపీటీసీలు సరీతరవీందర్, ఇందిరాదేవి, నాయకులు రవీందర్నాయక్, శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ ప్రవీణ్గౌడ్, గూడలకృష్ణగౌడ్, చంద్రశేకర్రెడ్డి, డైరక్టర్లు రాఘవేందర్, గౌతమ్, కళావతి, మణేమ్మ, వెంకటయ్య, ప్రమోద్, సీఈవో రఘురాజ్, ఆయా గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.