వరంగల్ చౌరస్తా, జనవరి 13 : బట్టలబజార్ వేంకటేశ్వరాలయం, జేపీఎన్ రోడ్లోని గీతాభవన్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. ధనుర్మాసం శుక్ల పక్షం ఏకాదశి తిథిని పురస్కరించుకొని గురువారం మూలవిరాట్కు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకున్నారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, కార్పొరేటర్లు గందె కల్పన-నవీన్ దంపతులు, ఆకుతోట తేజస్వి-శిరీష్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
కరీమాబాద్ : ఉర్సుగుట్టపై గోదాసహిత రంగనాయకస్వామి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, భక్తులు పూజలో పాల్గొన్నారు. కరీమాబాద్లోని బొమ్మలగుడిలో ప్రధాన అర్చకుడు శివపురం రామలింగ ఆరాధ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ కార్పొరేటర్ మేడిది రజిత, భక్తులు పాల్గొన్నారు. రంగశాయిపేటలోని రామాలయంలో పూజలు నిర్వహించారు. 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన, నాయకులు కొల్లూరి యోగానంద్, గుండు పూర్ణచందర్, భక్తులు పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : శివనగర్లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ట్రస్టు ఆధ్వర్యంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఆలయ ట్రస్టు బాధ్యులు పాల్గొన్నారు.
ఖానాపురం : మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, అశోక్నగర్ కోదండరామాలయం, బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అశోక్నగర్ రామాలయంలో స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ జినుకల సురేశ్, కర్రె కృష్ణారెడ్డి, గొల్లపూడి సుబ్బారావు పాల్గొన్నారు.
కాశీబుగ్గ : నగరంలోని కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి దేవాలయానికి భక్తులు తండోప తండోపాలుగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం జరిగే గోదా రంగనాథస్వామి కల్యాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేవాలయ అభివృద్ధి కమిటీ కన్వీనర్ వంగరి రవి, చిల్పూరు సురేశ్, మిట్టపల్లి సదానందం, గంగిడి ధర్మారెడ్డి, వంగరి సమ్మయ్య, మంచాల సమ్మయ్య, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, రామాచార్యులు, సుల్తాన, సమ్మక్క, కోలా కవిత, మంచాల సృజన పాల్గొన్నారు.
రాయపర్తి : మండలంలోని వెంకటేశ్వరపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం (సన్నూరు), మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, కొత్తూరులోని రామాలయం, కొండాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం, తిర్మలాయపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఆరుట్ల రంగాచార్యులు, వెంకట రామకృష్ణమాచార్యులు, వెంకట రమణాచార్యులు, మత్తగజం పంచాక్షరి, విజయ్కుమారశర్మ, బుచ్చిరామశర్మ, పరాశరం సుదర్శనాచార్యులు, కిరణ్కుమారచార్యులు తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : మండలంలోని కల్లెడ భూనీల సమేత కొలను వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు రంగాచార్యులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తక్కళ్లపల్లి వినీత్రావు నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల వెండి విగ్రహలను సమర్పించారు. వేమునూరి అశోక్ స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేసిన దీపాల సెట్టు బహూకరించారు. పొన్నంనేని హరిబాబు భగవద్గీత పుస్తకాలను భక్తులకు అందించారు. అలాగే, జమాలపురం సోమారం గ్రామంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకుడు రమణాచారి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ధర్మకర్త చందా శ్రీనివాస్, సర్పంచులు రేణుక నాగయ్య, రేణుక సాయిలు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి మధుసూదన్రావు, వెంకన్న నాయక్, బీవీ చారి పాల్గొన్నారు. మండలంలోని ఏనుగల్లు, పర్వతగిరి, అన్నారం షరీఫ్, చింతనెక్కొండ, వడ్లకొండ, దౌలత్నగర్, కొంకపాకలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు.
నర్సంపేట రూరల్ : నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట, గురిజాల రామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ర వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు, సర్పంచ్ గొడిశాల మమత-సదానందం, మాజీ సర్పంచ్ గడ్డం నర్సింగం, గుర్రం అచ్చయ్య, నర్సింగం, నీలం మల్లయ్య, ఆంజనేయులు, వేణు, చందర్, రాజు, సాయిప్రసన్న పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : వరంగల్ సెకండ్ డాక్టర్స్ కాలనీలోని వరద వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేంకటేశ్వరస్వామి, శివుడు, ఆంజనేయస్వామికి విశేష పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేశ్ కుమార్, సెక్రటరీ కిషన్రావు, కాలనీ కమిటీ అధ్యక్షుడు శరత్బాబు, సెక్రటరీ వినయ్, వెంకటరమణ, వేణు, శ్రీనివాస్, సంతోష్కుమార్, సోమశేఖర్, ప్రధాన అర్చకుడు వైజయంతుల శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
గీసుగొండ : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, ఎలుకుర్తి శివాలయం, గీసుగొండలోని లక్ష్మీనర్సింహస్వామి సమేత వేణుగోపాలస్వామి, గొర్రెకుంట క్రాస్లోని కట్టమల్లన్న ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుడు కాండూరి రామాచార్యులు, సిబ్బంది కనకయ్య, వీరస్వామి పాల్గొన్నారు.